చైనా బంగారు గనిలో చిక్కుకొన్న 22 మంది కూలీలు: కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్స్

Published : Jan 21, 2021, 02:59 PM IST
చైనా బంగారు గనిలో చిక్కుకొన్న 22 మంది కూలీలు: కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్స్

సారాంశం

చైనాలోని ఓ బంగారు గనిలో రెండు వారాల నుండి చిక్కుకొన్న 22 మంది కార్మికులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. కార్మికులను రక్షించడం కోసం ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది.  

బీజింగ్: చైనాలోని ఓ బంగారు గనిలో రెండు వారాల నుండి చిక్కుకొన్న 22 మంది కార్మికులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. కార్మికులను రక్షించడం కోసం ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది.

ఈ నెల 10వ తేదీన ఈ గనిలో పేలుడు సంభవించింది. షాన్‌డాంగ్ ప్రావిన్స్ లోని క్విజియా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న బంగారు గనిలో పేలుడు చోటు చేసుకొంది.  ఈ పేలుడుతో 22 మంది కూలీలు గనిలోనే చిక్కుకొన్నారు.

గని పూర్తిగా మూసుకుపోయింది. కూలీలు వంద అడుగుల లోతులో చిక్కుకొన్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

గనికి సమాంతరంగా మరో వైపున డ్రిల్లింగ్ చేసి అక్కడి నుండి కూలీలకు ఆహారం ఇతర సౌకర్యాలను అందిస్తున్నారు.గనిలో చిక్కుకొన్న కూలీల్లో 11 మందిలో ఒకరు చనిపోగా మరొకరు కోమాలోకి వెళ్లినట్టు చైనా మీడియా తెలిపింది. మిగిలిన 10 మంది ఆచూకీ తెలవాల్సి ఉందని మీడియా ప్రకటించింది.
 

PREV
click me!

Recommended Stories

Neal Katyal : ట్రంప్ కే చుక్కలు చూపిస్తున్న భారత సంతతి లాయర్.. ఎవరీ నీల్ కత్యాల్..?
US Tariffs : ట్రంప్ టారీఫ్స్ కు సుప్రీం బ్రేక్ .. అమెరికా అధ్యక్షుడి పవర్ ఈ చట్టంముందు తుస్సుమందిగా..!