తిట్టినందుకు 43 ఏళ్ల జైలు శిక్ష..! ఎక్కడంటే...

By AN TeluguFirst Published Jan 21, 2021, 10:50 AM IST
Highlights

ఓ 63 యేళ్ల మహిళకు థాయ్‌లాండ్‌ గవర్నమెంట్‌ 43 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. నిజానికి మొదట 87 సంవత్సరాలు అన్నారట.. కానీ ఆమె తను నేరం చేశానని అంగీకరించడం వల్ల ఆ శిక్ష 43 యేళ్లకు తగ్గింది.
 

ఓ 63 యేళ్ల మహిళకు థాయ్‌లాండ్‌ గవర్నమెంట్‌ 43 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. నిజానికి మొదట 87 సంవత్సరాలు అన్నారట.. కానీ ఆమె తను నేరం చేశానని అంగీకరించడం వల్ల ఆ శిక్ష 43 యేళ్లకు తగ్గింది.

ఇంతకీ ఆమె చేసిన అంత ఘోరనేరం ఏమిటి? అంటే థాయ్‌ రాచకుటుంబాన్ని తిట్టడం! అక్కడ మనలా కాదు. మనమైతే యదేచ్ఛగా ముఖ్యమంత్రిని, ప్రధానికి తిట్టేస్తుంటాం. ఆ స్వేచ్ఛ మనకు ఉంది. బట్ అక్కడ అలా కాదు 63 సంవత్సరాల అంచన్‌ రాజకుటుంబాన్ని తిట్టి ఆ వీడియోను సోషల్‌ మిడియాలో షేర్ చేసింది. అదే ఆమె చేసిన పాపం అయింది.

ఆమెకు విధించిన శిక్ష మీద థాయ్ లాయర్స్ ఫర్ హ్యూమన్ రైట్స్ గ్రూపుకు చెందిన పవినీ మాట్లాడుతూ,  ఇప్పటివరకు అత్యధిక జైలు శిక్ష విధించిన కేసు ఇదే అని చెప్పుకొచ్చారు. 

click me!