అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి.. ఒకరికి గాయాలు

Published : Oct 22, 2022, 03:50 AM IST
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి.. ఒకరికి గాయాలు

సారాంశం

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చేలరేగింది. వాషింగ్టన్‌కు ఈశాన్యంగా హడ్సన్ నది ఒడ్డున ఉన్న కొల్‌విల్లే ట్రైబ్స్ రిజర్వేషన్‌లో దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఒక పోలీసు అధికారి గాయపడినట్లు సమాచారం.

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. వాషింగ్టన్‌కు ఈశాన్యంగా హడ్సన్ నది ఒడ్డున ఉన్న కొల్‌విల్లే ట్రైబ్స్ రిజర్వేషన్‌లో దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఒక పోలీసు అధికారి గాయపడినట్లు సమాచారం. గిరిజనులు అధికంగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు అనుమానితుల్లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సమాచారం ప్రకారం, వాషింగ్టన్‌కు ఈశాన్యంగా హడ్సన్ నది ఒడ్డున ఉన్న కొల్‌విల్లే ట్రైబ్స్ రిజర్వేషన్‌లో కాల్పులు జరిగినట్లు సమాచారం. కాల్పుల ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు మరణించారని, ఒక పోలీసు అధికారి గాయపడ్డారని స్థానిక అధికారిని మీడియాకు తెలిపింది.


కాల్పులు జరిపి పారిపోయిన మరికొందరి దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. పరిసర ప్రాంతాల్లోని పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశారు. కొల్విల్లే ట్రైబ్స్ రిజర్వేషన్ గిరిజన ప్రాంతం. గురువారం ఇద్దరు వ్యక్తుల మృతదేహాలు లభ్యం కాగా, ఒక పోలీసు అధికారి గాయపడి కాపాడారు.  ఈ ఘటనలో ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.

గురువారం జరిగిన ఈ ఘటనలో సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారికి బుల్లెట్ గాయమైనట్లు కోల్‌విల్లే ట్రైబ్స్ రిజర్వేషన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ద్వారా సమాచారం అందింది. పోలీసు అధికారి వాహనంలో వెళ్తుండగా.. అనుమానిత దుండగులచే కాల్చబడ్డారు. ఈ ఘటనలో ఆ అధికారికి చేతి మీద బులట్ గాయమైంది. గాయపడిన అధికారిని ఆసుపత్రికి తరలించగా, అతను ప్రాణాపాయం నుండి బయటపడ్డాడని వైద్యులు తెలిపారు.
 

ఇద్దరు నిందితులను క్యూరీ పింక్‌హమ్‌, జాచరీ హోల్ట్‌గా పోలీసులు గుర్తించారు. మూడో నిందితుడిని గుర్తించలేదు. ఈ నిందితుల కోసం స్థానిక పోలీసులు, ఎఫ్‌బిఐ, బోర్డర్ పెట్రోల్, వాషింగ్టన్ పెట్రోల్ మరియు పోలీసులు వంటి ఇతర ఏజెన్సీలతో కలిసి రాత్రిపూట ఆపరేషన్ నిర్వహించినట్లు పోలీసు శాఖ   తెలిపింది. స్థానిక ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకుని నెస్పెలెం మరియు కెల్లర్ జిల్లాల్లో శుక్రవారం పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు కోల్‌విల్లే రిజర్వేషన్ కాన్ఫెడరేట్ ట్రైబ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోడి డిసౌటెల్ తెలిపారు.  

కొల్విల్లే కాన్ఫెడరేట్ ట్రైబ్స్‌లో దాదాపు 9,400 మంది సభ్యులను కలిగి ఉన్నారు; అమెరికాలోని డజను స్థానిక తెగల ప్రజల వారసులు. ఈ రిజర్వేషన్ సుమారు 2,200 చదరపు మైళ్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది రూజ్‌వెల్ట్ సరస్సుకు పశ్చిమాన ఉంది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !