సినిమా థియేటర్ లో టిక్ టాక్ స్టార్ దారుణ హత్య..!

By telugu news teamFirst Published Aug 2, 2021, 8:54 AM IST
Highlights

ఈ థియేటర్ చాలా తక్కువ మంది సినిమా చూడటానికి రాగా.. వీరిద్దరూ బలయ్యారు. గుడ్రిచ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఆంటోనీ తీవ్రంగా గాయపడ్డాడు. 

టిక్ టాక్ స్టార్ ఆంటోని బరాజాస్ దారుణ హత్యకు గురయ్యాడు.  కాలిఫోర్నియాలోని ఓ సినిమా థియేటర్ లో మూవీ చూసేందుకు వెళ్లిన ఆ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపడం గమనార్హం. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆంటోనీ బరాజాస్(19) తోపాటు..  అతని స్నేహితుడు రైలీ గుడ్రిచ్(18) ను కూడా దుండగులు కాల్చి చంపినట్లు కాలిఫోర్నియా పోలీసులు తెలిపారు.

థియేటర్ లో సినిమా చూసేందుకు వెళ్లిన వీరిపై కాల్పులు జరిపినట్లు గుర్తించారు. ఈ థియేటర్ చాలా తక్కువ మంది సినిమా చూడటానికి రాగా.. వీరిద్దరూ బలయ్యారు. గుడ్రిచ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఆంటోనీ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ  చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఇద్దరిపై దాడికి పాల్పడిన నిందితుడు జోసెఫ్ జిమెనెజ్(20) గా గుర్తించారు. కాల్పులు జరిపిన మరుసటి రోజు ఇతనిని అరెస్టు చేయడం గమనార్హం. నిందితుడు ఒక్కడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా.. అతని వెనక మరెవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది.

టిక్ టాక్ స్టార్ ఆంటోనీ.. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అతనికి టిక్ టాక్ లో దాదాపు 930,000 మంది ఫాలోవర్స్ ఉండటం గమనార్హం. అతని మృతి పట్ల ఫాలోవర్స్.. దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉండగా.. అమెరికాలో తుపాకీ సంస్కృతి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చాలా మంది దుండగులు.. తుపాకీ చేతపట్టి.. షాపింగ్ మాల్స్, స్కూల్స్ లలో కాల్పులు జరిపి.. చాలా మంది అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. 

click me!