రెయిన్ ఎఫెక్ట్: కేటీఆర్ చేతుల మీదుగా ఎమర్జెన్సీ టూ వీలర్ ఫోర్స్

By telugu teamFirst Published Sep 28, 2019, 6:03 PM IST
Highlights

విపత్తు సమయాల్లో త్వరితగతిన చేరుకోవడం వల్ల ప్రాణ నష్టాన్ని చాలామటుకు తగ్గించవచ్చని మంత్రి కేటీర్ అన్నారు. విపత్తు రక్షణ దళాలకు చెందిన అత్యవసర ద్విచక్ర వాహనాలను ప్రారంభిస్తూ మంత్రి కేటీర్ ఈ వ్యాఖ్యలు చేసారు. 

హైదరాబాద్: విపత్తు సమయాల్లో త్వరితగతిన చేరుకోవడం వల్ల ప్రాణ నష్టాన్ని చాలామటుకు తగ్గించవచ్చని మంత్రి కేటీర్ అన్నారు. విపత్తు రక్షణ దళాలకు చెందిన అత్యవసర ద్విచక్ర వాహనాలను ప్రారంభిస్తూ మంత్రి కేటీర్ ఈ వ్యాఖ్యలు చేసారు. 

విపత్తు సంభవించగానే ఈ ద్విచక్ర వాహనాలు త్వరితగతిన సంఘటనా స్థలానికి చేరుకుంటాయన్నారు. ట్రక్ లు వ్యాన్లు వంటివి చేరుకోవడానికి సమయం పడుతుంది కానీ ఈ ద్విచక్ర వాహనాలు వాటికన్నా ముందుగానే ఆ ప్రాంతానికి చేరుకునే ఆస్కారముంటుందన్నారు. పెద్ద వాహనాలు చేరుకోలేని ప్రాంతాలకు కూడా ఈ ద్విచక్ర వాహనాలు చేరుకుంటాయని మంత్రి తెలిపారు. 

రోడ్ల మీద కూలిన చెట్ల కొమ్మలను నరకడానికి, గుంతల్లో చేరిన నీటిని తోడి పోయడానికి తదితర చిన్న చిన్న పనులకు అవసరమైన సామాగ్రి అంతా ఈ ద్విచక్ర వాహనాల్లో ఉంటుందని కేటీర్ అన్నారు. 

ఈ కార్యక్రమంలో మంత్రి కేటీర్, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్ మోహన్, జి హెచ్ ఎం సి విపత్తు నిర్వహణ శాఖాధికారి విశ్వజిత్ తదితరులు పాల్గొన్నారు. 

click me!