సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఓ గర్భిణీకి చేయాల్సిన చికిత్సను మరో గర్భిణికి చేయడంతో ఆమె ప్రాణాపాయ స్థితికి చేరుకుంది.
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఓ గర్భిణీకి చేయాల్సిన చికిత్సను మరో గర్భిణికి చేయడంతో ఆమె ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. 9 నెలలు నిండిన గర్బిణీకి ఆపరేషన్ చేయాలని వైద్యులు తొలుత నిర్ణయించారు.
అయితే ఆమెకు బదులుకు ఏడు నెలల గర్బిణీ సమతకు శస్త్రచికిత్స చేశారు. ఈ ఘటనలో కడుపులో ఉన్న బిడ్డ మరణించగా, సమత పరిస్ధితి విషమంగా మారింది. దీనిపై మండిపడిన బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read:
కొత్తగా మరొకరికి .. తెలంగాణలో ఐదుకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
కరోనా కలకలం... ఫీవర్ ఆస్పత్రిలో 14మంది అనుమానితులు