ఎర్రగడ్డ పండ్ల మార్కెట్లో కారు బీభత్సం: మద్యం మత్తులో డ్రైవర్

By telugu teamFirst Published May 8, 2020, 3:50 PM IST
Highlights

హైదరాబాదులోని ఎర్రగడ్డ పండ్ల మార్కెట్ లో కారు బీభత్సం సృష్టించింది. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని, డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఘోర కారు ప్రమాదం సంభవించింది. ఎర్రగడ్డ పండ్ల మార్కెట్లో ఈ ప్రమాదం జరిగింది. ఎస్ఆర్ నగర్ పోలీసులు కారును స్వాధీనం చేసుకుని, డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

మద్యం మత్తులో డ్రైవర్ డివైడర్ ను ఢీకొట్టాడు. అయితే, ప్రమాదమేమీ సంభవించలేదు. ఎయిర్ బెలూన్స్ సహాయంతో అతను బయపడ్డాడు.

హైదరాబాదులోని కెపీహెచ్ బీ వద్ద ఓ లారీ మెట్రో పిల్లర్ ను ఢీకొట్టింది. దీంతో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ ఘటన జరిగినప్పుడు అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

హైదరాబాదులో పలు చోట్ల లాక్ డౌన్ కారణంగా రద్దీ లేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం రద్దీ పెద్ద యెత్తున ఉన్నట్లు తెలుస్తోంది.

click me!