రోజూ తేనె నీటిని తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో..!

Published : Feb 23, 2023, 09:40 AM IST
రోజూ తేనె నీటిని తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో..!

సారాంశం

తేనె నీటిని ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. తేనె, నీరు ఈ రెండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ తేనె నీటిని తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి.   

గోరువెచ్చని నీటిలో తేనెను వేసుకుని తాగే అలవాటు ఇప్పటిది కాదు. ఎన్నో ఏండ్ల నుంచి ఈ వాటర్ ను తాగుతున్నారు. ఎందుకంటే ఈ నీరు ఎన్నో అనారోగ్య సమస్యలను పోగొడుతుంది. ఆరోగ్యాన్ని బేషుగ్గా ఉంచుతుంది. తేనెలో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవ ఎన్నో అంటువ్యాధులతో పోరాడుతాయి. శరీర మంటను తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాదు తేనె జలుబు, ఫ్లూను కూడా ఇది తొందరగా తగ్గిస్తుంది. గోరు వెచ్చని నీటిలో తేనెను తాగితే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వాటర్ జీర్ణ ఎంజైమ్ల సంశ్లేషణను పెంచుతుంది. మలబద్దకం, కడుపు ఉబ్బరం, ఇతర జీర్ణసమస్యలను తగ్గిస్తుంది. ఈ వాటర్ తో ఇంకా ఏమేం ప్రయోజనాలు ఉన్నాయంటే? 

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

తేనెలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.ఇవి అంటువ్యాధులతో పోరాడటానికి ఎంతగానో సహాయపడతాయి. అలాగే శరీరంలో మంటను తగ్గించడానికి ఉపయోగపడతాయి.  క్రమం తప్పకుండా గోరువెచ్చని నీటిలో తేనెను వేసుకుని తాగితే జలుబు, ఫ్లూ వంటి సమస్యలు తగ్గిపోతాయి. అలాగే గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాల నుంచి ఉపశమనం కలుగుతుంది. 

జీర్ణక్రియకు సహాయపడుతుంది

గోరు వెచ్చని నీటితో తేనెను తీసుకుంటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వాటర్ జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. ఇది మలబద్ధకం, ఉబ్బరం, ఇతర జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందటానికి బాగా సహాయపడుతుంది.

నిర్విషీకరణ

తేనెలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరం నుంచి హానికరమైన విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా ఇవి సహాయపడతాయి. కాగా వెచ్చని నీరు మన శరీరంలోని చెడు పదార్థానలు, విషాన్ని బయటకు పంపడానికి, మొత్తం ఆర్ద్రీకరణ స్థాయిలను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది

గోరువెచ్చని నీటిలో తేనెను కలుపుకుని తాగడం వల్ల కూడా ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయని నిపుణులు చెబుతుున్నారు. ముఖ్యంగా ఈ వాటర్ మన శరీరాన్ని రిలాక్స్ గా ఉంచుతుంది. పడుకునే ముందు గ్లాస్ గోరువెచ్చని నీటిలో తేనెను కలుపుకుని తాగితే ఒత్తిడి స్థాయిలు తగ్గి మీరు ప్రశాంతంగా నిద్రపోతారు. తేనెలో సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి మనస్సును శాంతపరచడానికి, విశ్రాంతిని ప్రోత్సహించడానికి సహాయపడతాయి.


 

PREV
click me!

Recommended Stories

Sneeze Reflex: అస‌లు మ‌న‌కు తుమ్ము ఎందుకొస్తుందో తెలుసా.?
ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. చాలా ప్రమాదం