2018 సివిల్స్ మెయిన్స్ పరీక్షా ఫలితాలు విడుదల

sivanagaprasad kodati |  
Published : Dec 20, 2018, 06:23 PM IST
2018 సివిల్స్ మెయిన్స్ పరీక్షా ఫలితాలు విడుదల

సారాంశం

2018 సివిల్ మెయిన్స్ పరీక్షా ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. 2018 సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 7 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1994 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకి ఎంపికయ్యారు. 

2018 సివిల్ మెయిన్స్ పరీక్షా ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. 2018 సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 7 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1994 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకి ఎంపికయ్యారు. వీరికి వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్‌)లో ఉద్యోగాల నియామకాల కోసం మెయిన్స్ పరీక్షను నిర్వహించారు. ఇంటర్వ్యూకి సంబంధించి జనవరి 9 నుంచి షెడ్యూల్ వివరాలను కమీషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. 
ఫలితాల కోసం upsc.gov.in, upsconline.nic.in వెబ్‌సైట్‌ని క్లిక్ చేయండి.
 

PREV
click me!

Recommended Stories

తెలుగు యువతకు సూపర్ ఛాన్స్.. 3038 ఆర్టిసి ఉద్యోగాల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్
Government Jobs : రూ.78,800 శాలరీతో 173 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ