వినాయక్.. పనైపోయింది?

By Prashanth MFirst Published Apr 10, 2019, 3:13 PM IST
Highlights

హీరోల స్టార్ డమ్ ను దృష్టిలో పెట్టుకొని ఒక సినిమా చేయాలంటే దర్శకులకు కత్తి మీద సాము లాంటి పని. కానీ ఒకప్పుడు దర్శకుడు వివి.వినాయక్ అలాంటి ప్రాజెక్టులను చాలా తేలికగా తెరకెక్కించేవారు.

హీరోల స్టార్ డమ్ ను దృష్టిలో పెట్టుకొని ఒక సినిమా చేయాలంటే దర్శకులకు కత్తి మీద సాము లాంటి పని. కానీ ఒకప్పుడు దర్శకుడు వివి.వినాయక్ అలాంటి ప్రాజెక్టులను చాలా తేలికగా తెరకెక్కించేవారు. దిల్ - ఠాగూర్ - ఆది - అదుర్స్ - లక్ష్మి ఇలా చాలా సినిమాలు వినాయక్ టాలెంట్ ని బయటపెట్టాయి. 

అసలు మ్యాటర్ లోకి వస్తే.. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా.. అందుకే వినాయక్ సినిమాలను కూడా నేటి జనరేషన్ పట్టించుకోవడం లేదు. ఖైదీ నెంబర్ 150 సినిమా హిట్టయినప్పటికీ వినాయక్ నెక్స్ట్ తీసిన ఇంటిలిజెంట్ పై కనీసం పాజిటివ్ వైబ్రేషన్స్ రాలేవు. అయితే ఆ సినిమా డిజాస్టర్ అనంతరం బాలకృష్ణ - వెంకటేష్ - రవితేజ ఇలా చాలా మంది హీరోలతో వినాయక్ సినిమా చేయనున్నట్లు రూమర్స్ వచ్చాయి. 

కానీ వినాయక్ ఇంతవరకు తన తదుపరి కథను పట్టాలెక్కించలేదు. దాదాపు బాలకృష్ణ తో చేయడానికి సిద్దమే అనుకున్న సమయంలో కథలో బాలయ్యకు పట్టు కనిపించకపోవడంతో ఇంట్రెస్ట్ చూపడం లేదు. దీంతో వినాయక్ పనైపోయింది అంటూ కొన్ని మీడియాల్లో న్యూస్ లు వెలువడుతున్నాయి. అయితే వినాయక్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. మంచి కథతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకొని మళ్ళీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని చూస్తున్నాడు.  

click me!