వరుడి తండ్రి.. వధువు తల్లి ప్రేమాయాణం.. మరోసారి లేచిపోయారు..!

First Published Mar 2, 2020, 9:43 AM IST

పెళ్లి కొడుకు తండ్రి.. పెళ్లి కూతురు తల్లి లేచి పోయారు. పిల్లలిద్దరూ పెళ్లి చేసుకుంటే తమ వరసలు ఎక్కుడ మారిపోతాయో అనే భయంతో.. వాళ్లిద్దరూ ఎవరికీ చెప్పకుండా పారిపోయారు. వారి ప్రేమ.. వీళ్ల ప్రేమను తుంచేసింది.

కొద్దిరోజుల క్రితం... వరుడు తండ్రి.. వధువు తల్లి లేచిపోయారంటూ ఓవార్త వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ మధ్యవయసు దంపతుల ప్రేమాయణంలో మరో ట్విస్ట్ వచ్చిచేరింది. ఆ ప్రేమ జంట మరోసారి లేచిపోయింది. మరోసారి వారి ప్రేమాయం వైరల్ గా మారింది.
undefined
పూర్తి వివరాల్లోకి వెళితే... సూరత్ కి చెందిన ఓ యువ జంట ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. వారు ఉండేది పక్కపక్క ఇళ్లల్లోనే. చిన్నప్పటి నుంచి ఒకరి గురించి మరొకరికి తెలుసు. చిన్ననాటి స్నేహమే పెద్దయ్యాక ప్రేమగా మారింది. వారి ప్రేమను పెళ్లిదాకా తీసుకువెళ్లడానికి వాళ్లు పెద్దగా కష్టపడింది లేదు.
undefined
రెండు కుటుంబాలకు పరిచయం ఉండటంతో వీరి పెళ్లికి త్వరగానే అంగీకరించారు. సంవత్సరం క్రితమే వీరి పెళ్లి ఫిక్స్ అయ్యింది. మరో పది రోజుల్లో వీరు పెళ్లి పీటలు ఎక్కాల్సి ఉంది. కానీ పెళ్లి ఆగిపోయింది.
undefined
కారణం ఏమిటో తెలుసా... పెళ్లి కొడుకు తండ్రి.. పెళ్లి కూతురు తల్లి లేచి పోయారు. పిల్లలిద్దరూ పెళ్లి చేసుకుంటే తమ వరసలు ఎక్కుడ మారిపోతాయో అనే భయంతో.. వాళ్లిద్దరూ ఎవరికీ చెప్పకుండా పారిపోయారు. వారి ప్రేమ.. వీళ్ల ప్రేమను తుంచేసింది.
undefined
వాళ్లిద్దరూ కలిసి లేచిపోయారు అనే విషయం తెలుసుకోవడానికే వీళ్లకు చాలా రోజులే పట్టింది. పెళ్లి పనులు మొదలుపెట్టిన రోజు నుంచే ఇటు అబ్బాయి వాళ్ల తండ్రి.. అటు అమ్మాయి వాళ్ల అమ్మ కనిపించకుండా పోయారు.
undefined
వీళ్లు ఏమైపోయారా అని అంతా వెతికారు. కానీ ఆచూకీ మాత్రం దొరకలేదు. వీళ్ల ఆచూకీ కోసం వెతుకుతున్న క్రమంలో వాళ్లిద్దరూ లేచిపోయారనే విషయం అర్థమయ్యింది.అంతేకాదు వాళ్ల ప్రేమ విషయం కూడా బయటపడింది.
undefined
పెళ్లికొడుకు తండ్రి రమేష్( పేర్లు మార్చాం).. పెళ్లి కూతురు తల్లి సరిత(పేర్లు మార్చాం) లకు యవ్వనదశలో ఉన్నప్పటి నుంచే పరిచం ఉందట. వాళ్లిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారట కూడా. అయితే.... కొన్ని కుదరక వాళ్ల ప్రేమ పెళ్లిదాకా రాలేదు.
undefined
ఇద్దరూ వేరేవాళ్లను పెళ్లి చేసుకున్నారు. కానీ... ఇళ్లు మాత్రం పక్కపక్కనే తీసుకున్నారట. ఇన్ని సంవత్సరాలుగా వాళ్లు పక్క పక్క ఇళ్లలోనే ఉంటూ వచ్చారు. సడెన్ గా పిల్లలు ప్రేమ.. పెళ్లి అంటూ ముందుకు వచ్చి నిలబడటంతో ఏమిచెయ్యాలో అర్థం కాలేదు.
undefined
ముందు మాత్రం అనుమానం రాకుండా పెళ్లికి ఒప్పుకున్నట్లు నటించారు. తీరా పెళ్లి తేదీ దగ్గరకు వచ్చి.. పెళ్లి పనులు మొదలుపెట్టేసరికి ఎవరికీ చెప్పకుండా ఇద్దరూ లేచిపోయారు. వీళ్ల ప్రేమ విషయం తెలిసి ఇరు కుటుంబాలవారు ముక్కున వేలుసుకున్నారట.
undefined
అయితే.. లేచిపోయిన వారిద్దరూ వాలంటైన్స్ డే రోజు తిరిగి వచ్చేశారట. తాము చేసిన తప్పును గ్రహించి తిరిగి ఎవరి ఇళ్లకు వారు వచ్చేశారట.
undefined
కానీ... లేచిపోయిన జంట కదా వాళ్లకు పెద్దగా గౌరవం దక్కలేదు. వియ్యంకుడితో లేచిపోయిన భార్య సరితను ఆమె భర్త తిరిగి ఇంట్లోకి రానివ్వలేదట. దీంతో ఆమె తన పుట్టింటికి వెళ్లింది.
undefined
తమ తప్పు తెలుసుకొని తిరిగివచ్చినప్పటికీ.. వారిద్దరిని అందరూ చీదరించుకున్నారు. మరీ ముఖ్యంగా వధువు తల్లిని నీచంగా చూడటం మొదలుపెట్టారు. ఇలాంటి వ్యతిరేకతను ఊహించని వారిద్దరూ డిప్రెషన్ లోకి వెళ్లారట.
undefined
అందుకే తెగించి మరోసారి లేచిపోయారు. వియ్యంకులు కావాల్సిన వారు ఇలా వియ్యపురాలితో లేచి పోవడంతో వారి పిల్లల పెళ్లి కాస్తా రద్దు అయింది. మధ్య వయసు ప్రేమికులైన రమేష్, సరిత లు తమ తమ కుటుంబాలను వదిలి రెండోసారి లేచి పోయి సూరత్ నగరంలోనే ఓ అద్దె ఇల్లు తీసుకొని నివశిస్తున్నట్లు తేలింది.
undefined
వీరిద్దరూ యుక్తవయసులోనే ఓ పెళ్లిలో ఒకరిని మరొకరు చూసుకొని ప్రేమలో పడ్డారని, కానీ అప్పట్లో పెళ్లి చేసుకోలేక పోయారని తేలింది. తొలుత ప్రేమించుకున్న తమ పిల్లలకు పెళ్లి చేయాలనుకున్నారు కానీ, అలా చేస్తే అన్నాచెల్లెళ్లు అవుతామని భావించి పారిపోయారు. ఇప్పుడు సెపరేట్ గా ఇళ్లు తీసుకొని హ్యాపీగా జీవితాన్ని గడిపేస్తున్నారు.
undefined
click me!