సాధారణంగా చాలా మంది రైళ్లలో వెళ్లేందుకు ముందుగా టికెట్లు బుకింగ్ చేసుకుంటూ ఉంటారు. అవి కన్ఫర్మ్ అయినా, కాకపోయినా అకౌంట్ నుంచి డబ్బులు మాత్రం కట్ అవుతాయి. అయితే IRCTC కొత్తగా ప్రవేశపెట్టిన బుక్ నౌ.. పే లేటర్ పథకంతో ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండానే టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ సమయంలో డబ్బులు లేకపోయినా ఇకపై పెద్దగా ఇబ్బంది ఉండదు.