మిలియన్ల మంది ప్రయాణికులు రోజూ ఇండియన్ రైల్వేస్పై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా ముంబై, డిల్లీ, కలకత్తా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాలకు సమీపంలో నివసించే వారు రోజూ అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. వీళ్లే కాకుండా సంక్రాంతి, దసరా, క్రిస్మస్, వంటి ముఖ్యమైన పండగలకు సొంతూర్లకి తక్కువ ఖర్చుతో వెళ్లాలనుకున్న వారు కూడా జనరల్ టికెట్ తీసుకుంటారు.
ఇంతకు ముందు జనరల్ టికెట్ అంటే రైల్వే స్టేషన్లోని కౌంటర్ లో మాత్రమే తీసుకోవాల్సి వచ్చేది. దీంతో పెద్ద క్యూలో గంటల తరబడి నిలబడి మరీ టికెట్లు తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు.