బీజేపీ నేతలు ఫైర్..
రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కౌంటర్ అటాక్కి దిగారు. రేవంత్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నారని దుమ్మొత్తి పోశారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. 2001లో మోదీ గుజరాత్ సీఎం అయ్యారని.. కానీ 1994లోనే గుజరాత్లోని అప్పటి ప్రభుత్వం మోదీ కులాన్ని బీసీల జాబితాలో చేర్చిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రేవంత్ రెడ్డి వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు.
ఇక కిషన్ రెడ్డి సైతం రేవంత్పై ధ్వజమెత్తారు. రేవంత్ దిగజారి మాట్లాడుతున్నారని, అవగాహన లేని వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. నిజాలు తెలుసుకుని మాట్లాడితే మంచిందటూ సూచించారు.
మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఏకంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ కులం ఏంటో, మతం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆ సమయానికి మోదీ పాలిటిక్స్లో లేరు
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. 1994లో గుజరాత్ ప్రభుత్వం మోదీ కులాన్ని బీసీలో కలిపిందన్నారు. ఇక 1999లో కేంద్ర ప్రభుత్వం ఈ కులాన్ని దేశవ్యాప్తంగా బీసీలో కలిపిందన్నారు. ప్రధాని మోదీ కులాన్ని గుజరాత్ ప్రభుత్వం బీసీలో కలిపినప్పుడు 1994లో మోడీ ఎలక్ట్రోరల్ పాలిటిక్స్ లో లేరని అర్వింద్ స్పష్టం చేశారు. కులం గురించి మాట్లాడి రచ్చ చేయాలనే కుట్రలో భాగంగానే రేవంత్ రెడ్డి మోడీ కులం పై మాట్లాడుతున్నారని అర్వింద్ విమర్శించారు.