ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఎఫెక్ట్ ఒడిశా, చత్తీస్ ఘడ్ తో పాటు గంగానది పరివాహక రాష్ట్రాల్లో గట్టిగా ఉంటుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కేరళలో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఇక ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలో కూడా వర్షతీవ్రత పెరుగుతుందని IMD హెచ్చరించింది.
ఉత్తర ప్రదేశ్ లోని తూర్పు ప్రాంతంలో భారీ వర్షాలుంటాయని... గుజరాత్, గోవా, రాజస్థాన్ లో ఇదే పరిస్థితి ఉంటుందట. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో వర్షతీవ్రత ఎక్కువగా ఉంటుందట. మొత్తంగా దేశవ్యాప్తంగా వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.