తీవ్ర గాలుల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే గడచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. పలాస, మందసలో 17 సెం.మీ., టెక్కలి, గరివిడి, పాతపట్నంలో 9 సెం.మీ., కురుపాం, కలింగపట్నం, సోంపేట, చీపురుపల్లి, పాలకొండలో 7 సెం.మీ. వర్షం కురిసింది. విశాఖపట్నంలో గురువారం అత్యధికంగా గంటకు 66 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. భారీ వర్షాలు, గాలుల కారణంగా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.