ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపాడు చిచ్చు: అపెక్స్ కౌన్సిల్ సమావేశం తేల్చేనా?

First Published Oct 5, 2020, 9:18 PM IST

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య నీటి ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో  చోటు చేసుకొన్న వివాదాలు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పరిష్కారం అవుతాయా అనే చర్చ సాగుతోంది.ఈ నెల 6వ తేదీన తొలిసారిగా అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి ప్రాజెక్టుల నిర్మాణంపై నెలకొన్న వివాదాలు అపెక్స్ సమావేశంతో పరిష్కారమౌతాయా అనే చర్చ సాగుతోంది. ఈ నెల 6వ తేదీన అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనుంది.
undefined
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే న్యూఢిల్లీకి చేరుకొన్నారు. మంగళవారం నాడు ఢిల్లీ నుండే ఆయన ఈ సమావేశంలో పాల్గొంటారు. కేసీఆర్ హైద్రాబాద్ నుండి ఈ సమావేశంలో పాల్గొంటారు.
undefined
ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వాదనను గట్టిగా విన్పించాలని ఇటీవల అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాంపై అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
undefined
రెండు రాష్ట్రాల మధ్య రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చిచ్చు పెట్టింది.ఈ ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణలోని నల్గొండ, మహాబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారే అవకాశం ఉందని కేసీఆర్ సర్కార్ వాదిస్తోంది.శ్రీశైలం నుండి ప్రతి రోజూ 3 టీఎంసీల నీటిని వాడుకొనే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది.పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి సుమారు 80 వేల క్యూసెక్కుల నీటిని డ్రా చేయాలని ప్రతిపాదించారు.
undefined
వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే పోతిరెడ్డిపాడు నుండి 11,500 క్యూసెక్కుల నుండి 40వేల క్యూసెక్కుల నీటిని వాడుకొనేలా అప్పట్లో జీవో జారీ చేశారు. ఈ జీవోపై అప్పట్లో తెలంగాణవాదులు, టీఆర్ఎస్ నిరసనకు దిగింది. మాజీ మంత్రులు పీజేఆర్, మర్రి శశిధర్ రెడ్డిలు వైఎస్ఆర్ పై తీవ్ర విమర్శలకు దిగారు.
undefined
తెలుగుగంగ, ఎస్ఆర్‌బీసీ, గాలేరు నగరి.కేసీ కెనాల్ ఆయకట్టుుకు నీటిని అందించేందుకు ఉద్దేశించినట్టుగా ఏపీ ప్రభుత్వం చెబుతోంది..శ్రీశైలంలో 880అడుగుల నీరున్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని వాడుకొనే వీలుంటుంది. దీంతో తెలంగాణ వాడుకొనే విధంగా 800 అడుగుల నుండే నీటిని ఉపయోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను ప్రతిపాదించింది.
undefined
శ్రీశైలంలో 800 అడుగుల నుండే రోజుకు మూడు టీఎంసీలను తరలించడానికి తెలంగాణ ప్రభుత్వం నాలుగు ప్రాజెక్టులచేపట్టిందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. 796 అడుగుల నుండే రోజూ 42 వేల క్యూసెక్కులను తెలంగాణ వాడుకొనేలా డిజైన్ చేసిందని ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.
undefined
మరో వైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అపెక్స్అనుమతి లేకుండా నిర్మించేందుకు తెలంగాణ నిర్మిస్తోందని కూడ ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్టుతో పాటు డిండి.ఇరిగేషన్ పై కూడ సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు పిటిషన్ వేసింది.
undefined
జూరాల నుండి భీమా, కోయిల్ సాగర్, నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని తరలిస్తోందని ఏపీ ఫిర్యాదు చేసింది. శ్రీశైలం నుండి 800 అడుగుల నుండే కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీటిని వినియోగించుకొంటున్నట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం, సీతారామ, తుపాకుల గూడెం, లోయర్ పెన్ గంగా, రామప్ప నుండి పాకాల వరకు నీటి తరలింపు విషయమై కూడ గోదావరి బోర్డుకు తెలంగాణపై ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.
undefined
click me!