నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు: పోలింగ్ సరళిని పరిశీలించిన కవిత

First Published Oct 9, 2020, 11:31 AM IST


నిజామాబాద్ ఎమ్మెల్సీ ‌ఉప‌ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత కామారెడ్డి లో పర్యటించారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప‌ గోవర్ధన్ తో‌ కలిసి స్థానికంగా పోలింగ్ సరళిని పరిశీలించారు.

నిజామాబాద్ ఎమ్మెల్సీ ‌ఉప‌ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత కామారెడ్డి లో పర్యటించారు. కామారెడ్డి ఎమ్మెల్యే గంప‌ గోవర్ధన్ తో‌ కలిసి స్థానికంగా పోలింగ్ సరళిని పరిశీలించారు.
undefined
కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం లోని పోలింగ్ బూతులో ఓటింగ్ సరళిని పరిశీలించారు కవిత. అనంతరం స్థానిక ‌నేతలు, కార్యకర్తలతో కవిత ముచ్చటించారు.
undefined
హైదరాబాద్ నుండి కామారెడ్డి చేరుకున్న టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత కు దారిపొడవునా నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డాయి. కరోనా నేపథ్యంలో రెండు సార్లు ఈ ఎన్నికలను వాయిదా వేశారు. ఇవాళ ఈ ఎన్నికలను నిర్వహిస్తున్నారు.
undefined
గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలైన కవితను ఈ స్థానం నుండి టీఆర్ఎస్ బరిలోకి దింపింది. 824 ఓటర్లున్న ఈ స్థానంలో విజయంపై ఎవరికి వారే ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కూడ ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి.
undefined
ఈ స్థానంలో ఓటు హక్కును వినియోగించుకొనే 24 మంది ఓటర్లకు కరోనా సోకింది. వీరికి పోలింగ్ చివరి గంటలో ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. వీరంతా ఇవాళ సాయంత్రం 4 గంటల నుండి ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది.
undefined
click me!