ఏం జరిగింది :
సూర్యాపేట జిల్లా నాగారం మండల డి.కొత్తపల్లి గ్రామానికి చెందిన కాసం సోమయ్య భార్యాపిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన కడారి సోమయ్య, సైదులు, కాసం కళింగం లతో చాలాకాలంగా సోమయ్యకు భూతగాదాలు వున్నాయి. ఇటీవల ఈ తగాదాలు మరింత ముదిరి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే స్థాయికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే గత గురువారం సోమయ్య ఇంటికి ఇనుపరాడ్లు, కర్రలు తీసుకుని వెళ్లారు దాయాదులు. కుటుంబసభ్యుల ఎదుటే సోమయ్యను విచక్షణారహితంగా చితకబాదారు.