భవిష్యత్తులో మరిన్ని సేవలు..
ఇదిలా ఉంటే ఆర్టీసీ భవిష్యత్తులో మరిన్ని డిజిటల్ సేవలను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే కొన్ని బస్సుల్లో స్వైపింగ్ మిషిన్స్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే రానున్న రోజుల్లో బస్ పాస్ను కూడా మొబైల్లో చూపించే రోజులు రానున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు బస్పాస్ రెన్యూవల్ కోసం ప్రతీ నెల సంబంధిత సెంటర్ల వద్ద నిలబడాల్సి వస్తుంది. అయితే ఆన్లైన్లో పాస్ పొందే అవకాశాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం ఆర్టీసీ ప్రత్యేక యాప్ను తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం.