ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలో ఈ నెల 15వ తేదీ నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులను నిర్వహించనున్నారు. ఇక స్కూల్ టైమింగ్స్ విషయానికొస్తే.. ఉదయం 8 గంట లకు ప్రారంభమై.. మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు కొనసాగుతాయి. అయితే పదో తరగతి పరీక్షలు జరిగే సెంటర్లలో మాత్రం సమయాల్లో తేడాలు ఉంటాయి. ఈ పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఇప్పటికే ఉర్దూ పాఠశాలల్లో హాఫ్ డే స్కూల్ అమల్లోకి వచ్చాయి.