తెలంగాణ మంత్రుల్లో విభేదాలు: రంగంలోకి కేటీఆర్

First Published Mar 4, 2020, 1:34 PM IST

హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో మంత్రుల మధ్య, టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాల్లో ఈ పరిస్థితి నెలకొంది. మంత్రుల మధ్య విభేదాలను పరిష్కరించి, సమన్వయం కుదర్చడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ రంగంలోకి దిగారు

తెలంగాణలోని పలు జిల్లాల్లో మంత్రుల మధ్య, టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాల్లో ఈ పరిస్థితి నెలకొంది. మంత్రుల మధ్య విభేదాలను పరిష్కరించి, సమన్వయం కుదర్చడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ రంగంలోకి దిగారు.
undefined
విభేదాలు తారాస్థాయికి చేరుకుని రచ్కకెక్క ముందే కేటీఆర్ వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. ఎర్రబెల్లి దయాకర్ రావు ములుగు, మహబూబాబాద్ జిల్లాల వ్యవహారాల్లో తలదూరుస్తున్నారని సత్యవతి రాతోడ్ అసంతృప్తితో ఉన్నారు
undefined
ఆ విషయం కేటీఆర్ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఆయన రంగంలోకి దిగి ములుగు, మహబూబాబాద్ జిల్లాలను సత్యవతీ రాథోడ్ కు వదిలేసి వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మిగతా జిల్లాల మీద దృష్టి కేంద్రీకరించాలని కెటీఆర్ ఎర్రబెల్లి దయాకర్ రావుకు సూచించినట్లు తెలుస్తోంది
undefined
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రులు ఈటెల రాజేందర్, గంగుల కమలాకర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని అంటున్నారు. దీంతో కేటీఆర్ జోక్యం చేసుకుని సమన్వయంతో పనిచేసుకోవాలని వారిద్దరికి సూచించినట్లు చెబుతున్నారు.
undefined
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే పరిస్థితి మరో విధంగా ఉంది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి పట్ల ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
undefined
ఖమ్మం జిల్లాలో మూడు వర్గాలున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ వర్గం ఒకటి కాగా, మాజీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గం మరోటి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వర్గం కూడా మరోటి ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని వ్యవహారాల పట్ల తుమ్మల నాగేశ్వర రావు ఒకటి, రెండు సార్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం కూడా తెలిసిందే.
undefined
పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉన్నట్లు కెటీఆర్ దృష్టికి వచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమన్వయంతో పనిచేయడం లేదని ఆయనకు సమాచారం అందుతోంది. నిజామాబాద్, నల్లగొండ, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నట్లు సమాచారం
undefined
click me!