వారణాసిలో కేసీఆర్ కుటుంబం.. గంగా హారతిలో శోభ, కవిత (ఫోటోలు)

First Published Jan 28, 2021, 9:18 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిని సందర్శించింది. సీఎం సతీమణి‌ శ్రీమతి శోభ, కుమార్తె కల్వకుంట్ల కవిత, ఇతర కుటుంబ సభ్యులు పలు దేవాలయాలను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గురువారం సాయంత్రం గంగా హారతి నిర్వహించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిని సందర్శించింది. సీఎం సతీమణి‌ శ్రీమతి శోభ, కుమార్తె కల్వకుంట్ల కవిత, ఇతర కుటుంబ సభ్యులు పలు దేవాలయాలను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గురువారం సాయంత్రం గంగా హారతి నిర్వహించారు.
undefined
సీఎం కుటుంబం గురువారం శంషాబాద్ విమానాశ్రయం నుండి వారణాసి బయలుదేరారు. ముందుగా అస్సి ఘాట్ కు చేరుకుని అక్కడి నుండి దశాశ్వమేధ ఘాట్ వరకు బోట్‌లో ప్రయాణించారు. ఈ సందర్భంగా బోటు నడిపే వారితో ఎమ్మెల్సీ కవిత కాసేపు ముచ్చటించారు
undefined
దశాశ్వమేధ ఘాట్‌లో గంగా నదికి హారతి ఇచ్చిన కవిత అనంతరం గంగా పూజ నిర్వహించారు. దశాశ్వమేధ ఘాట్ లో స్థానిక బెనారస్ ప్రజలతో ఆమె సంభాషించారు. పవిత్ర గంగమ్మ సాక్షిగా బెనారస్ ప్రజలతో సంభాషించడం ఆనందంగా ఉందన్నారు కవిత. అనంతరం బోట్ లో‌ అస్సీ ఘాట్ కు తిరుగు ప్రయాణమయ్యారు.
undefined
సాయంత్రం ప్రాచీన సంకట‌్ మోచన్ మందిరాన్ని దర్శించుకొని, పట్టు వస్త్రాలు సమర్పించారు. మహంత్ తులసీదాస్ నిర్మించిన సంకట్ మోచన్ హనుమాన్ దేవాలయం ఎంతో ప్రసిద్ధి గాంచింది. శ్రీరాముడు, రామభక్తుడైన హనుమంతుడు ఎదురెదురుగా ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత.
undefined
ఆలయ ప్రధాన పూజారి మహంత్ డా.విశ్వంభర నాథ్ మిశ్రా, ఎమ్మెల్సీ కవిత, శ్రీమతి శోభ గార్లతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించారు ‌కవిత.
undefined
click me!