Telangana: ఆసక్తిని పెంచుతోన్న రేవంత్‌ ఢిల్లీ టూర్‌.. మంత్రి వర్గంలోకి ఆ నలుగురు?

Narender Vaitla | Published : Mar 25, 2025 11:07 AM
Google News Follow Us

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది గడుస్తోంది. అయితే ఇప్పటికీ పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ మాత్రం జరలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఓ కీలక అప్డేట్‌ వచ్చింది. సోమవారం ఢిల్లీ వెళ్లిన రేవంత్‌ అధిష్టానంతో మంత్రివర్గ విస్తరణ గురించి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.. 
 

15
Telangana: ఆసక్తిని పెంచుతోన్న రేవంత్‌ ఢిల్లీ టూర్‌.. మంత్రి వర్గంలోకి ఆ నలుగురు?
Telangana Chief Minister A Revanth Reddy (Photo/ANI)

2023 డిసెంబర్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్‌ రెడ్డితో పాటు మరో 11 మంది మాత్రమే మంత్రులుగా బాధ్యతుల చేపట్టిన విషయం తెలిసిందే. అయితే మరో ఆరుగురిని మంత్రులుగా నియమించే అవకాశం ఉండగా ఇప్పటి వరకు కాంగ్రెస్‌ ఆ దిశగా అడుగులు వేయలేదు. హోం, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌, విద్య, జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ వంటి కీలక శాఖలను రేవంత్‌ రెడ్డి తన దగ్గరే పెట్టుకున్నారు. 

కాగా తాజాగా సోమవారం ముఖ్యమంత్రి రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌లు ఢిల్లీ వెళ్లడంతో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, కేసీ వేణుగోపాల్‌లతో జరిగిన సమావేశంలో మంత్రివర్గ విస్తరణ ప్రధాన అజెండాగా ఉన్నట్లు తెలుస్తోంది. 6 స్థానాలకు అవకాశం ఉన్నా ప్రస్తుతం 4 స్థానాలను భర్తీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మంత్రి పదవుల రేసులో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. 
 

25
G Vivek

చెన్నూరు ఎమ్మెల్యే జి. వివేక్‌:

మంత్రివర్గంలోకి తీసుకుంటారన్న జాబితాలో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లలో చెన్నూరు ఎమ్మెల్యే జి. వివేక్‌ ఉన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్న వివేక్‌ ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లోకి అటు నుంచి బీజీపీలోకి చేరిన విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీల్లో విజయాన్ని అందుకోలేకపోయారు. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరిన వివేక్‌ చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక మంత్రి పదవి ఆఫర్‌తోనే వివేక్‌ బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరినట్లు సమాచారం.  
 

35
p sudarshan reddy

బోధన్‌ ఎమ్మెల్యే పి. సుదర్శన్‌ రెడ్డి: 

నిజామాబాద్‌ జిల్లా నుంచి ఒక్కరికి కూడా మంత్రి వర్గంలో స్థానం కల్పించలేదన్న చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే సుదర్శన్‌ రెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే అధిష్టానం వద్ద ఆయన పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. 
 

Related Articles

45
srihari

మక్తల్‌ ఎమ్మెల్యే శ్రీహరి: 

ఇక మంత్రివర్గంలోకి వచ్చే అవకాశాలున్న మరో పేరు మక్తల్‌ ఎమ్మెల్యే శ్రీహరి. తెలంగాణలో బలమైన ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన శ్రీహరిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు బెర్త్ కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తోంది.

55
Komatireddy Rajagopal Reddy

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి: 

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలో ఉన్న కోమటిరెడ్డి ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌లోకి చేరారు. అయిత ఆ సమయంలో మంత్రివర్గ హామీతోనే పార్టీలో చేరినట్లు సమాచారం. ఇదిలా ఉంటే రాజగోపాల్‌ రెడ్డి సోదరుడు వెంకట్‌ రెడ్డి ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న విషయం తెలిసిందే. 
 

Read more Photos on
Recommended Photos