ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పర్యవేక్షిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి చెక్కులను పంపిణీ చేస్తారు. సంబంధిత సంఘాల ఖాతాల్లో ఈ రుణ సాయం నేరుగా జమవుతుంది.రుణ సాయం పక్కన పెడితే, ప్రభుత్వం మరో కీలకంగా ముందుకొచ్చింది. మహిళా సంఘాల సభ్యులకు ప్రమాద బీమా, రుణ బీమా పథకాలు అమలులో ఉన్నాయి. ప్రమాదవశాత్తూ సభ్యుడు మరణిస్తే, ఆయన కుటుంబానికి రూ. 10 లక్షల బీమా మొత్తం లభిస్తుంది. అంతేగాక, మరణించిన సభ్యుల పేరిట ఉన్న రుణాలను పూర్తిగా మాఫీ చేస్తారు.