దుబ్బాకలో కాంగ్రెస్ కు హరీష్ రావు దెబ్బ: తెర వెనుక చక్రం తిప్పిన తన్నీరు

First Published Oct 9, 2020, 2:13 PM IST

దుబ్బాక అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి. కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ ఇవాళ షాకిచ్చింది. కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు కీలక నేతలు టీఆర్ఎస్ గూటికి చేరారు. 

దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు టీఆర్ఎస్ షాకిచ్చింది. టీఆర్ఎస్ కు షాకిస్తూ కాంగ్రెస్ లో చెరుకు శ్రీనివాస్ రెడ్డి చేరారు. శ్రీనివాస్ రెడ్డికే కాంగ్రెస్ పార్టీ టికెట్టు ను ఖరారు చేసింది. దీంతో పార్టీ టికెట్ ఆశించిన నర్సింహ్మారెడ్డి, మనోహార్ రావులు టీఆర్ఎస్ లో చేరారు.
undefined
దుబ్బాక అసెంబ్లీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్ధి సోలిపేట సుజాతను గెలిపించే బాధ్యతను మంత్రి హరీష్ రావు తన భుజాలపై వేసుకొన్నాడు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయకముందే నియోజకవర్గంంలో మంత్రి హరీష్ రావు విస్తృతంగా పర్యటిస్తున్నారు.
undefined
టీఆర్ఎస్ టికెట్టు ఆశించిన చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. అయితే కాంగ్రెస్ పార్టీ టికె్ట్ ఆశించిన నర్సింహ్మారెడ్డి, మనోహార్ రావులు ఇవాళ టీఆర్ఎస్ లో చేరారు.
undefined
కాంగ్రెస్ టికెట్ తమకు దక్కదని తెలిసిన తర్వాత వీరిద్దరూ కూడ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. వీరిద్దరూ కాంగ్రెస్ వీడడం వెనుక మంత్రి హరీష్ రావు చక్రం తిప్పారు. శ్రీనివాస్ రెడ్డిని పార్టీలో చేర్చుకొన్న హస్తం పార్టీకి హరీష్ చెక్ పెట్టారు.ఇద్దరు కీలక నేతలు టీఆర్ఎస్ లో చేరేలా తెర వెనుక చక్రం తిప్పారనే చర్చ సాగుతోంది. సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత గెలుపు కోసం కాలికి బలపం కట్టుకొని హరీష్ రావు విస్తృతంగా పర్యటిస్తున్నారు.
undefined
కాంగ్రెస్,బీజేపీలకు చెక్ పెట్టేలా హరీష్ రావు ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ కు షాకిచ్చిన కాంగ్రెస్ కు అదే స్థాయిలో టీఆర్ఎస్ షాకిచ్చింది. ఎన్నికల సమయంలో ఇద్దరు నియోజకవర్గస్థాయి నేతలు పార్టీని వీడడం ఆ పార్టీకి పెద్ద షాకే.
undefined
క్షేత్రస్థాయి కార్యకర్తలపై కూడ టీఆర్ఎస్ కేంద్రీకరించింది. కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకొని టీఆర్ఎస్ వ్యూహాలను రచిస్తోంది.ప్రతి మండలానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలను ఇంఛార్జీలుగా నియమించింది. మరో వైపు ప్రతి గ్రామానికి కూడ ఇంఛార్జీలను నియమించింది.
undefined
సిద్దిపేట జిల్లాకు చెందిన పార్టీ కార్యకర్తల సమావేశం జరిగిన మరునాడే కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు పార్టీని వీడడం కాంగ్రెస్ వర్గాల్లో కలవరానికి కారణమైంది. ఈ ఎన్నికలను కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. ఈ ఎన్నికల వ్యూహాంపై పార్టీ రాష్ట్ ఇంఛార్జీ మాణికం ఠాగూర్ పార్టీ నేతలతో చర్చించారు.
undefined
మరో వైపు బీజేపీ నేత రఘునందన్ రావుకు టికెట్టు ఇవ్వడాన్ని నిరసించిన కమలాకర్ రెడ్డిపై బీజేపీ వేటేసింది. గత రెండు ఎన్నికల్లో ఈ స్థానం నుండి రఘునందన్ రావు పోటీ చేసిన విషయం తెలిసిందే.
undefined
click me!