జీహెచ్ఎంసీ ఎన్నికలు: గెలుపు గుర్రాల వేటలో పార్టీలు

First Published Nov 17, 2020, 4:12 PM IST

జీహెచ్ఎంసీ ఎన్నికలు తెలంగాణలో రాజకీయ వేడిని రగిల్చింది. ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాల కోసం ప్రయత్నిస్తున్నాయి.

జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్ధుల వేటలో మునిగిపోయాయి. జీహెచ్ఎంసీపై మరోసారి జెండాను ఎగురవేయాలని టీఆర్ఎస్ భావిస్తుండగా, బల్దియాపై కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ ఎన్నికల్లో తమ పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తామని టీడీపీ ప్రకటించింది.ఈ ఎన్నికల్లో గెలిచే అభ్యర్ధులను బరిలోకి దింపాలని ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.
undefined
2016లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగాయి. 2021 ఫిబ్రవరి 10వ తేదీతో జీహెచ్ఎంసీ పాలకవర్గం పదవీ కాలం ముగియనుంది. దీంతో ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది.గతంలోని రిజర్వేషన్ల ఆధారంగానే ఈ దఫా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీన జీహెచ్ఎంసీ పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 4వ తేదీ పోలింగ్ జరుగుతుంది.
undefined
దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయంతో జీహెచ్ఎంసీని కూడ కైవసం చేసుకోవాలని బీజేపీ ఉత్సాహంతో ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం బీజేపీ నేత భూపేంద్ర సింగ్ యాదవ్ ను బీజేపీ ఇంచార్జీగా ప్రకటించింది. బీజేపీ కేంద్ర నాయకత్వం కూడ జీహెచ్ఎంసీ ఎన్నికలను సీరియస్ గా తీసుకొంది.
undefined
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు షాకివ్వాలని బీజేపీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు బీజేపీ ఇప్పటికే ఇంచార్జీలను నియమించింది. ఆయా నియోజకవర్గాల్లోని డివిజన్లకు బాధ్యులను నియమించింది.
undefined
కాంగ్రెస్ తో పాటు టీఆర్ఎస్ లోని అసంతృప్తులకు బీజేపీ గాలం వేస్తోంది. మాజీ మేయర్ బండ కార్తీక బీజేపీలో చేరనున్నారు.ఇప్పటికే బండ కార్తీక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో ఇవాళ సమావేశమయ్యారు.
undefined
టీఆర్ఎస్ కు చెందిన కొందరు నేతలు ఇటీవల కాలంలో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. మరికొందరు నేతలు కూడ బీజేపీలో చేరే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను కమల దళం దాదాపుగా పూర్తి చేసిందని సమాచారం. వీలైతే మంగళవారం నాడే జీహెచ్ఎంసీలో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను విడుదల చేసేందుకు బీజేపీ ప్లాన్ చేసింది.
undefined
కాంగ్రెస్ పార్టీ కూడ అభ్యర్ధుల ఎంపికకు కసరత్తు చేస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను ధరఖాస్తులను కోరింది. ఈ నెల 19వ తేదీన జీహెచ్ఎంసీ అభ్యర్ధులకు బీ పారాలను కాంగ్రెస్ పార్టీ ఇవ్వనుంది. ఇప్పటికే పోటీకి ఆసక్తిగా ఉన్న అభ్యర్ధులు ధరఖాస్తులు చేసుకొన్నారు.
undefined
ఆయా నియోజకవర్గాల నుండి పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను తయారు చేయాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. కార్పోరేటర్ గా పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను నేతలు సిద్దం చేస్తున్నారు.దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమితో టీఆర్ఎస్ నాయకత్వం కొంత ఆత్మపరీశీలన చేసుకొంటుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది.
undefined
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ,శాసనససభపక్ష సమావేశం ఈ నెల 18వ తేదీన కేసీఆర్ నిర్వహిస్తున్నాడు. ఈ సమావేశానికి పార్టీ నేతలంతా విధిగా హాజరు కావాలని కేసీఆర్ ఆాదేశించారు. సిట్టింగ్ కార్పోరేటర్లలో కొందరికి మొండిచేయి దక్కే అవకాశం లేకపోలేదు. టీఆర్ఎస్ కార్పోరేటర్ల జాబితాను పార్టీ సిద్దం చేసింది. ఇవాళ లేదా రేపు కార్పోరేటర్ల జాబితాను టీఆర్ఎస్ విడుదల చేసే అవకాశం ఉంది.
undefined
క్షేత్రస్థాయిలో నెగిటివ్ ప్రచారం ఉన్న అభ్యర్ధులను టీఆర్ఎస్ మార్చనుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దింపితే విజయం దక్కుతోందనే విషయమై టీఆర్ఎస్ నాయకత్వం ఇప్పటికే సర్వేలు నిర్వహించింది. ఈ సర్వేల ఆధారంగా టీఆర్ఎస్ అభ్యర్ధుల ఎంపికను చేయనుంది.
undefined
ఈ ఎన్నికల్లో పోటీ చేస్తామని టీడీపీ ప్రకటించింది. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలు కలిసి పోటీ చేశాయి. కానీ ఈ దఫా టీడీపీ ఒంటరిగా పోటీ చేయనుంది. గత ఎన్నికల్లో టీడీపీకి ఒక్క కార్పోరేటర్ సీటు మాత్రమే దక్కింది.
undefined
గత అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో పోటీ చేసిన ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ రెండో స్థానంలో నిలిచింది. 2016 నాటి ఎన్నికలతో పోలిస్తే ఇప్పటివరకు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకొన్నాయి.
undefined
గెలిచే అవకాశం ఉన్న చోట పోటీ చేయాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు. తెలంగాణ నేతలతో చంద్రబాబు ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జీహెచ్ఎంసీ ఎన్నికల గురించి చర్చించారు.రాగద్వేషాలకు అతీతంగా అభ్యర్ధుల ఎంపిక చేయాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు.
undefined
click me!