దుబ్బాక బైపోల్‌లో విజయం: జీహెచ్ఎంసీపై కమలం కన్ను

First Published Nov 13, 2020, 4:14 PM IST

దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఊపులో ఉన్న బీజేపీ.... జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడ విజయం సాధించాలని భావిస్తోంది.ఈ మేరకు ప్రణాళికలను సిద్దం చేస్తోంది.

దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించడంతో జీహెచ్ఎంసీ ఎన్నికలపై కమల దళం గురి పెట్టింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది.
undefined
దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించడం బీజేపీలో ఉత్సాహన్ని నింపాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను దెబ్బకొట్టాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.ఇతర పార్టీల్లోని అసంతృవాదులను తమ వైపునకు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా టీఆర్ఎస్ అసమ్మతి నేతలపై బీజేపీ కేంద్రీకరించింది.
undefined
మరోవైపు ఏయే డివిజన్లలో ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై కూడ బీజేపీ నాయకత్వం ఇప్పటినుండే కసరత్తు చేస్తోంది. ఎంఐఎం, టీఆర్ఎస్ బంధాన్ని ప్రస్తావిస్తూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాతబస్తీలో బీజేపీ తన ప్రాబల్యాన్ని పెంచుకొనే ప్రయత్నం చేస్తోంది.
undefined
నగరంలోని పలు డివిజన్లలో బీజేపీ నేతలతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు, వరదలతో నగరంలో పలు కాలనీలు గత మాసంలో నీటిలో మునిగిపోయాయి. ఇంకా కొన్ని కాలనీల్లో నీళ్లు ఉన్నాయి.
undefined
నగరంలో పలు కాలనీల్లోకి నీరు చేరడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. వరద సహాయంలో టీఆర్ఎస్ నేతల చేతివాటం ప్రదర్శించారని బీజేపీ పెద్ద ఎత్తున ఆరోపిస్తోంది. ఈ విషయమై పలు ప్రాంతాల్లో బీజేపీ నేతలు ఆందోళనలు నిర్వహించారు.
undefined
బీజేపీ కీలకనేతలు జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కిషన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహాల్ మినహా ఏ అసెంబ్లీ స్థానంలో కూడ బీజేపీ విజయం సాధించలేదు. కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించింది.
undefined
కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలహీనంగా మారుతుందని ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్నాయి. దీంతో టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బ్యాంకును తమ వైపునకు తిప్పుకొనేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది.
undefined
దుబ్బాకలో టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బ్యాంకు గంపగుత్తగా బీజేపీ వైపునకు మళ్లడంతోనే కమల వికాసం జరిగిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.హైద్రాబాద్ నగరంలో కేంద్ర నిధులతో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల గురించి బీజేపీ ప్రచారం నిర్వహించనుంది.బీజేపీ కీలక నేతలంతా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది.
undefined
click me!