Published : Jan 18, 2021, 12:36 PM ISTUpdated : Jan 18, 2021, 01:21 PM IST
హైదరాబాద్: టిడిపి అదినేత, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్బంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. ఆయనతో పాటు తనయుడు నారా లోకేష్, మనవడు దేవాన్షుతో పాటు ఆ పార్టీకి చెందిన కీలక నాయకులు కూడా చంద్రబాబు వెంట ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని నివాళులు అర్పించారు. హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య కూడా తన తండ్రికి నివాళులు అర్పించారు.