సుజాత అనే టీచర్ తో అతనికి ఉన్న వివాహేతర సంబంధం కారణంగానే ఈ మరణం సంభవించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో చేస్తున్న దర్యాప్తులో పోలీసులకు కీలక ఆధారాలను గుర్తించినట్లు తెలుస్తోంది. మృతుడి సెల్ఫోన్ కాల్ డేటాలో చివరిసారిగా గవర్నమెంట్ టీచర్ అయిన సుజాతతో మాట్లాడినట్లు ఉండడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేశారు. ఆమెకు, మృతుడు రాజేష్ కి ఉన్న సంబంధం మీద ఆరా తీస్తున్నారు. అయితే, సుజాత కూడా రాజేష్ మృతదేహం వెలుగు చూడడానికి మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా తేలింది.