సిద్దిపేట: తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో జలాయశయాలు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఇదే సరయిన సమయంగా భావించిన తెలంగాణ ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ లో చేప పిల్లలను విడిచిపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.