టీపీసీసీ చీఫ్ పదవికి కొత్త నేత: సోనియాకు ఐదు పేర్లిచ్చిన ఠాగూర్

First Published Dec 24, 2020, 4:05 PM IST

టీపీసీసీ చీఫ్ పోస్టుకు కొత్త నేత ఎంపిక ప్రక్రియ మరో ఐదు రోజుల్లో ముగిసే అవకాశం ఉంది. ఐదుగురి  పేర్లతో షార్ట్ లిస్ట్ ను మాణికం ఠాగూర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీకి సమర్పించారు. 

టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకొంది. తుది దశలో టీపీసీసీ చీఫ్ పదవికి ఐదుగురు పేర్లను పార్టీ చీఫ్ సోనియాగాంధీకి పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ అందించారు.
undefined
తెలంగాణ రాష్ట్రంలో వరుస ఓటములతో టీపీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఇటీవలనే హైద్రాబాద్ కు వచ్చిన మాణికం ఠాగూర్ పార్టీకి చెందిన సీనియర్లు, డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీల నుండి అభిప్రాయాలను సేకరించారు.
undefined
టీపీసీసీ చీఫ్ అధ్యక్ష పదవికి తుది జాబితాలో ఐదుగురు పేర్లను ఠాగూర్ సోనియాగాంధీకి అందించారు. మరో మూడు రోజుల పాటు టీపీసీసీ చీఫ్ పదవికి కొత్త నేత ఎంపిక విషయంలో పార్టీ నాయకత్వం సమాలోచనలు చేయనుంది.
undefined
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ కూడ అందుబాటులో ఉంటారు.
undefined
టీపీసీసీ చీఫ్ పదవి విషయంలో తన అభిప్రాయాన్ని పార్టీ చీఫ్ సోనియా గాంధీకి ఠాగూర్ వివరించారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయ వాతావరణంతో పాటు ఎవరిని టీపీసీసీ చీఫ్ పదవికి ఎవరిని ఎంపిక చేస్తే పార్టీకి ప్రయోజనం కలుగుతోందనే విషయాన్ని ఠాగూర్ సోనియాకు వివరించినట్టుగా తెలుస్తోంది.
undefined
ఐదు రోజుల్లో టీపీసీసీ చీఫ్ పదవికి కొత్త నేత ఎవరనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది.
undefined
రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క పేర్లు ప్రధానంగా పీసీసీ చీఫ్ రేసులో విన్పించాయి. అయితే తాజా రేసులో మరో ఇద్దరి పేర్లు కూడ రేసులో విన్పిస్తున్నాయి.కొత్తగా చేరిన ఆ ఇద్దరి పేర్లపై పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
undefined
click me!