అయితే మల్కాజ్ గిరి ఎమ్మెల్యే హన్మంతరవు చేరికపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇవాళ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, టిపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తదితరులు మైనంపల్లి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. కానీ ఇప్పటికే కాంగ్రెస్ తో మంతనాలు పూర్తయి మల్కాజ్ గిరి, మెదక్ సీట్లపై హామీ లభించిందని... అందువల్లే మైనంపల్లి ధైర్యంగా బిఆర్ఎస్ కు రాజీనామా చేసారని రాజకీయ చర్చ జరుగుతోంది.