సోదరి చందన, ఆమె ప్రియుడు, ప్రియుడి తల్లి, అతని తరపు మరో బంధువు, కారు డ్రైవర్లను దీప్తి మృతి కేసులో ప్రమేయం ఉన్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే…. కోరుట్లలోని భీమునిదుబ్బకు చెందిన బంక దీప్తి ఆగస్టు 29వ తేదీన వారి ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెంది కనిపించింది. మరోవైపు అదే రోజు రాత్రి ఆమె దీప్తి చెల్లెలు చందన కనిపించకుండా పోయింది. ఆరోజు రాత్రి చందన ఓ యువకుడితో కలిసి బస్టాండ్ నుంచి నిజామాబాదుకు వెళుతున్నట్లుగా ఆ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీలో రికార్డు అయింది.