హైదరాబాద్ : దేశవ్యాప్తంగానే కాదు తెలంగాణలోనూ వాడవాడలా బొజ్జ గణపయ్య వెలిసాడు. ముఖ్యంగా రాజధాని నగరం హైదరాబాద్ వినాయక చవితి శోభతో కళకళలాడుతోంది. ఈ వినాయక చవితి వేడుకల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచే ఖైరతాబాద్ గణేషుడు కూడా కొలువుదీరాడు. ఈసారి ఖైరతాబాద్ లో శ్రీ పంచముఖ మహాలక్ష్మి అవతారంలో గణపయ్య భక్తులకు దర్శనమిస్తున్నాడు. పర్యావరణ హితంగా మట్టితో తయారుచేసిన 50 అడుగుల ఖైరతాబాద్ గణేషుడికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తొలి పూజ చేశారు.