రెండు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో నేడు ఏలూరు, కృష్ణా, ఎన్డీఆర్, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. కాబట్టి ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వర్ష సమయంలో చెట్లు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని సూచించింది.
అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్ధ వెల్లడించింది. వర్షాలతో పాటు ఉదయం, రాత్రి సమయాల్లో చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉండనుందని ఏపిఎస్డిఎమ్ఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.