హైద్రాబాద్ చంపాపేట స్వప్న కేసు: ప్రియుడితో సంబంధం, భార్యను చంపినభర్త

First Published Oct 29, 2023, 2:26 PM IST

హైద్రాబాద్ నగరంలోని చంపాపేటలో వివాహిత స్వప్న హత్య కేసులో మిస్టరీ వీడింది. 
 

హైద్రాబాద్ చంపాపేట స్వప్న కేసు: ప్రియుడితో సంబంధం, భార్యను చంపినభర్త

నగరంలోని చంపాపేటలో  వివాహిత స్వప్న హత్య కేసు మిస్టరీ వీడింది.  భర్త ప్రేమ్ కుమారే  భార్య స్వప్నను హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు.  ప్రియుడితో స్వప్న వివాహేతర సంబంధం కొనసాగించడం వల్లే  ఈ హత్య జరిగిందని  పోలీసులు తేల్చారు.

హైద్రాబాద్ చంపాపేట స్వప్న కేసు: ప్రియుడితో సంబంధం, భార్యను చంపినభర్త

పెళ్లికి ముందే  స్వప్న సతీష్ అనే యువకుడిని ప్రేమించింది. ప్రేమ్ కుమార్ తో  స్వప్నకు వివాహమైంది.  పెళ్లైన తర్వాత స్వప్న తన ప్రియుడితో సంబంధాలు కొనసాగిస్తుంది. చంపాపేటలోని ఓ ఇంట్లో  స్వప్న ఆమె భర్త ప్రేమ్ కుమార్ నివాసం ఉంటున్నారు.   ప్రియుడితో  స్వప్న సంబంధం కొనసాగిస్తున్న విషయమై  భర్త ప్రేమ్ కుమార్ ఆమెను నిలదీశాడు.ఈ విషయమై భార్యాభర్తల మధ్య  గొడవలు జరుగుతున్నాయని చెబుతున్నారు.

హైద్రాబాద్ చంపాపేట స్వప్న కేసు: ప్రియుడితో సంబంధం, భార్యను చంపినభర్త

ఈ నెల  28న  భర్త ప్రేమ్ కుమార్ ఇంట్లో లేని సమయంలో  సతీష్  అనే యువకుడు  స్వప్న వద్దకు వచ్చాడు. అయితే  అదే సమయంలో  ప్రేమ్ కుమార్ ఇంటికి వచ్చాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్వప్న భర్త ప్రేమ్ కుమార్ ఆగ్రహంతో  రగిలిపోయాడు.   భార్య స్వప్న పై దాడి చేసి హత్య చేశాడు భర్త ప్రేమ్ కుమార్

హైద్రాబాద్ చంపాపేట స్వప్న కేసు: ప్రియుడితో సంబంధం, భార్యను చంపినభర్త

మరో వైపు  స్వప్న ప్రియుడు  సతీష్ తో  ప్రేమ్ కుమార్ గొడవ పడ్డాడు. ఈ క్రమంలో  ప్రేమ్ కుమార్ ను సతీష్  నెట్టి వేయడంతో  భవనంపై నుండి కిందకు పడ్డాడు. ప్రేమ్ కుమార్ ను స్థానికులు  ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స నిర్వహించారు. అక్కడి నుండి ఆయనను  ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. 
 

హైద్రాబాద్ చంపాపేట స్వప్న కేసు: ప్రియుడితో సంబంధం, భార్యను చంపినభర్త

ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న  ప్రేమ్ కుమార్ ను  పోలీసులు ప్రశ్నించారు.  స్వప్న హత్య గురించి ఆరా తీశారు.  స్వప్నను హత్య చేసిన  విషయాన్ని  పోలీసుల దర్యాప్తులో ప్రేమ్ కుమార్  వెల్లడించారని సమాచారం. ప్రేమ్ కుమార్ ఆరోగ్యంగా విషమంగా ఉందని  వైద్యులు చెబుతున్నారు. ప్రేమ్ కుమార్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 

హైద్రాబాద్ చంపాపేట స్వప్న కేసు: ప్రియుడితో సంబంధం, భార్యను చంపినభర్త

Vythiri Police

ఇదిలా ఉంటే  ప్రేమ్ కుమార్ ను  భవనంపై నుండి కిందకు తోసేసిన  సతీష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  మూడు బృందాలు సతీష్ కోసం గాలిస్తున్నాయి.ఈ ఘటనకు సంబంధించి పోలీసులు  లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. స్వప్న మృతిపై  ఆమె పేరేంట్స్ ఇచ్చిన ఫిర్యాదుపై  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

click me!