బిపి తగ్గిపోయి, ఊపిరి సరిగ్గా అందక, మాటిమాటికి పిడ్స్ వస్తూ... బాలుడి ఆరోగ్య పరిస్థితి క్షీణించి ప్రాణాపాయ స్థితిలో వున్నాడు. దీంతో కిమ్స్ కడల్స్ వైద్యులు వెంటనే మెరుగైన వైద్యం అందించడం ప్రారంభించారు. తొమ్మిదిరోజుల పాటు హైదరాబాద్ లో వైద్యం అందుకున్న బాలుడు ఇప్పుడు పూర్తి ఆరోగ్యంగా మారాడు. ఇక్కడికి తీసుకువచ్చిన రోజునుండే వైద్యం అందించడంతో ఐదు రోజుల్లోనే అతడు కోలుకున్నాడని... ప్రాణాపాయం నుండి తప్పడంతో వెంటిలేటర్ తొలగించినట్లు డాక్టర్లు తెలిపారు. తొమ్మిదిరోజుల్లో పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జ్ చేసినట్లు కిమ్స్ కడల్స్ డాక్టర్ పరాగ్ డెకాటే వెల్లడించారు.