ఆ బస్సు కండక్టర్ భారతి, ప్రయాణికుల్లో ఒకరైన నర్సు అలివేలు మంగమ్మ కలిసి సంధ్యకు కాన్పు చేసారు. ఇలా బస్సులోని సంధ్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇలా సమయస్పూర్తితో వ్యవహరించి రెండు ప్రాణాలను కాపాడిన కండక్టర్, నర్సును ప్రతిఒక్కరు అభినందిస్తున్నారు.
ఇలా ఆర్టిసి బస్సులో మహిళ పండంటి బిడ్డనుకన్న విషయం సోషల్ మీడియా ద్వారా ఆర్టిసి ఎండి సజ్జనార్ వరకు చేరింది. దీంతో ఆయన ఆ బిడ్డతో కండక్టర్ భారతి, నర్సు అలివేలుకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. బస్సులో పుట్టిన ఆ ఆడబిడ్డకు జీవితాంతం ఆర్టిసి బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే కండక్టర్, నర్సు కూడా ఓ సంవత్సరంపాటు తెలంగాణకు చెందిన డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. ఇందుకు సంబంధించిన బస్ పాసులను భారతి, అలివేలుకు అందించారు ఆర్టిసి ఎండీ.