హుజూరాబాద్‌ బైపోల్స్: రేవంత్ , బండి సంజయ్‌లకు సవాలే..

First Published Jul 22, 2021, 4:07 PM IST

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలు  కాంగ్రెస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకమే.  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ చీఫ్ రేవంత్ రెడ్డిలకు ఈ ఎన్నికలు ఓ సవాలే.   ఈ ఇద్దరు నేతలు కూడ ఈ ఎన్నికల్లో చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 

నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై బీజేపీ దృష్టి పెట్టింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయంగా ఆ పార్టీ ప్రచారం చేసుకొంటుంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీలో ఉత్సాహన్ని నింపాయి. నాగార్జునసాగర్ ఉప ఎన్నికపై కూడ బీజేపీ కేంద్రీకరించింది.

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ చీఫ్ లు రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌లకు ఓ సవాలేననే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.


గత మాసంలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఈటల రాజేందర్  టీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే పదవికి కూడ ఆయన రాజీనామా చేశారు. దీంతో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యంగా మారాయి.. 
 

revanth

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలు బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ చీప్  రేవంత్ రెడ్డికి కూడ కీలకమే.

etela


హుజూరాబాద్ తో పాటు అంతకుముందు కమలాపూర్ అసెంబ్లీ స్థానం నుండి ఈటల రాజేందర్ వరుసగా విజయం సాధించాడు.  బీజేపీలో చేరిన తర్వాత తొలిసారిగా ఆయన ఈ స్థానం నుండి పోటీ చేయనున్నారు.

revanth reddy

టీపీసీసీ చీఫ్ గా  రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నియమించింది.ఇటీవలనే ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ బాధ్యతలను చేపట్టిన తర్వాత తొలిసారిగా హుజూరాబాద్ ఉప ఎన్నికలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి

Kaushi Reddy

 గత ఎన్నికల్లో ఈ స్థానం నుండి కాంగ్రెస్ నుండి  పోటీ చేసిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. గత ఎన్నికల్లో కౌశిక్ రెడ్డికి 60 వేలకు పైగా ఓట్లు వచ్చాయి.

మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి వేరే చోట ఓటు హక్కు ఉంది. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో ఆయన ఓటు హక్కును వినియోగించుకొనే పరిస్థితి లేదు.

గత ఎన్నికల్లో వచ్చిన  ఫలితం కంటే మెరుగైన ఫలితం కాంగ్రెస్ పార్టీకి దక్కితేనే రేవంత్ రెడ్డికి పార్టీ అధిష్టానం వద్ద మైలేజీ రానుంది. ఒకవేళ వ్యతిరేక ఫలితం వస్తే రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గీయులకు కొంత ఊతమిచ్చినట్టేననే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. 

Revanth Reddy

పార్టీ సీనియర్లు ఎంత మంది వ్యతిరేకించినా కూడ రేవంత్ రెడ్డికే పార్టీ పగ్గాలు అప్పగించారు.  అయితే ఈ ఒక్క ఎన్నికతోనే అన్ని విషయాలను బేరీజు వేయలేమనే అభిప్రాయాలు కూడ వ్యక్తం చేసే  వారు లేకపోలేదు.

ఒకవేళ తనకు గనుక పీసీసీ పదవి దక్కనట్టయితే.... రేవంత్తన సొంత అజెండాతోముందుకెళ్లాలనియోచిస్తున్నారు. సొంతగా ఒక ప్రాంతీయ పార్టీ పెట్టె ఆలోచనలోరేవంత్ ఉన్నారనేది ఈ మధ్య వినబడుతున్న మాట. రేవంత్ సొంత పార్టీ పెట్టి లాభపడాలంటే... కేసీఆర్ కి ధీటైన నాయకుడు అని అనిపించుకోవాలి. కేసీఆర్ మీద చేస్తున్న ఈ యుద్ధం రేవంత్ ఇమేజ్ ని పెంచడానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది.

వచ్చే రెండేళ్లపాటు పార్టీ క్యాడర్ లో ఉత్తేజం నింపుతూ ఎన్నికలకు సిద్దం కావాలి.  అయితే ఏ మేరకు రేవంత్ రెడ్డి తీసుకొనే  నిర్ణయాలు  పార్టీని ఆ దిశగా తీసుకెళ్తాయనేది భవిష్యత్తు నిర్ణయిస్తోంది. 

revantha Reddy

ఇదిలా ఉంటే తక్షణంగా హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలు రేవంత్ కు సవాలే. ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితం రాబట్టి ప్రత్యర్థుల నోళ్లు మూయించడమే ఆయన ముందున్న తక్షణ కర్తవ్యమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 

bandi sanjay

ఇక మరోవైపు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కి కూడ ఈ ఎన్నికలు సవాలే. బండి సంజయ్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత వచ్చిన రెండు ఎన్నికల్లో  ఆ పార్టీ  మెరుగైన ఫలితాలు సాధించింది.

dubbaka

ఇటీవల జరిగిన రెండు ఎన్నికల్లో ఆ పార్టీ ఆశించిన ఫలితాలు సాధించలేదు. దుబ్బాక ఉప ఎన్నికల్లో  బీజేపీ గెలుపొందింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ మంచి ఫలితాలను సాధించింది. 

nomula bhagat


ఆ తర్వాత   వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  బీజేపీ ఓటమి పాలైంది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి ఆశించిన ఫలితం దక్కలేదు.  మరోసారి హుజూరాబాద్ ఉప ఎన్నికలను బండి సంజయ్ ఎదుర్కోనున్నారు.

ఈ నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు బీజేపీ ప్లాన్ చేసింది. ఇదే జిల్లాలోని గుర్రంబోడులో గిరిజనుల భూముల సమస్యపై బీజేపీ నేతలు ఆందోళన నిర్వహించారు. అధికార పార్టీ నేతల అండతో గిరిజనుల భూములను ఆక్రమించుకొన్నారని బీజేపీ విమర్శించింది.


సంజయ్ ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.  సంజయ్  ప్రాతినిథ్యం వహిస్తున్న కరీంనగర్ ఎంపీ స్థానం పరిధిలోనే హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం  ఉంటుంది. 

జీహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకొంటామని బీజేపీ ధీమాతో ఎన్నికల బరిలోకి దిగింది.జీహెచ్ఎంసీ పీఠం దక్కించుకొనే మ్యాజిక్ ఫిగర్ కు బీజేపీ చాలా దూరంలో నిలిచింది. కానీ టీఆర్ఎస్ కు బీజేపీ చుక్కలు చూపింది.

 ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ విజయం సాధించడం ఆయనతో పాటు  బండి సంజయ్ కూడ అంతే ముఖ్యం.  తన స్వంత పార్లమెంట్ నియోజకవర్గంలోని ఈ స్థానంలో  జరిగిన ఉప ఎన్నికల్లో వ్యతిరేక ఫలితం  వస్తే  ఆయనకు కొంత ఇబ్బందేననే అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో బరిలోకి దింపే అభ్యర్ధి విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్ధిని ప్రకటించిన తర్వాత బీజేపీ తన అభ్యర్ధిని ప్రకటించే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.


ఈ ఉప ఎన్నికలను బీజేపీ కూడ సీరియస్‌గా తీసుకొంది.  ఇప్పటికే ఇంచార్జీలను ఆ పార్టీ నియమించింది. ఇంచార్జీలు తమకు కేటాయించిన  మండలాల్లో  విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నికల్లో విజయం సాధిస్తే టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అనే స్థానాన్ని బీజేపీ సుస్థిరం చేసుకొనేందుకు సహాయపడుతోంది. 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి రాజకీయంగా ఈ విజయం ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంది.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ వ్యూహాంగా కన్పిస్తోంది. టీఆర్ఎస్ కు  తామే ప్రత్యామ్నాయమని కొంత కాలంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

దుబ్బాకలో టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బ్యాంకు గంపగుత్తగా బీజేపీ వైపునకు మళ్లడంతోనే కమల వికాసం జరిగిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.హైద్రాబాద్ నగరంలో కేంద్ర నిధులతో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాల గురించి బీజేపీ ప్రచారం నిర్వహించనుంది.బీజేపీ కీలక నేతలంతా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది.

. కానీ నాగార్జునసాగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. బీజేపీకి డిపాజిట్ కూడ దక్కలేదు. హుజూరాబాద్  ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోనని విశ్లేషకులు ఆసక్తి కనబరుస్తున్నారు.

click me!