తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో సమస్యల పరిష్కారం కోసం వామపక్ష విద్యార్థి సంఘాలు కూడా పోరాటానికి సిద్దమయ్యాయి. ఇందులో భాగంగానే ఇవాళ (జూలై 1, బుధవారం) హైదరాబాద్ లో AISF, SFI, PDSU, AIFDS, AIDSO, AIPSU వంటి విద్యార్థి సంఘాల నాయకులు సమావేశమై కార్యాచరణ రూపొందించాయి. ఈ సందర్భంగా జూలై 10 (శుక్రవారం) తెలంగాణలోని విద్యాసంస్థల బంద్ చేపట్టాలని నిర్ణయించాయి... ఈ మేరకు పోస్టర్ ను కూడా ఆవిష్కరించారు నాయకులు.
అంటే జూలై 10న విద్యాసంస్థలు మూతపడనున్నాయి... స్కూల్, కాలేజీ విద్యార్థులకు అదనంగా సెలవు వస్తుందన్నమాట. విద్యాసంస్థలు స్వచ్చందంగా సెలవు పాటించకున్నా విద్యార్థి సంఘాల నాయకులు మూసివేయించే అవకాశాలుంటాయి. ఇలాంటి పరిస్థితి రాకుండా విద్యంసంస్థల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులు తమకు సహకరించాలని... బంద్ ను పాటించాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.