కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్ రావుకు చోటు, లెక్కలు ఇవీ...

First Published Jul 27, 2019, 10:41 AM IST

ఆగస్టు మొదటి వారంలో తెలంగాణ మంత్రి వర్గాన్ని విస్తరించేందుకు గులాబీ బాస్ కసరత్తు చేస్తున్నారని ఎవరెవరికి అవకాశాలు ఇవ్వాలో కూడా ఇప్పటికే డిసైడ్ అయినట్లు సమాచారం. మంత్రి వర్గంలో నలుగురికి స్థానం కల్పించనున్నట్లు తెలుస్తోంది. 

తెలంగాణ రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్ధమైందా..? ఆగష్టు మెుదటి వారంలోనే మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందా...? ఈసారి మంత్రి వర్గ విస్తరణలో ఎవరెవరికి బెర్త్ లు దక్కనున్నాయి..? మంత్రి పదవికి దూరమైన హరీష్ రావుకు ఈసారి బెర్త్ కన్ఫమ్ అయ్యే అవకాశం ఉందా...?
undefined
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు విస్తరణలో ఛాన్స్ లభించే అవకాశం ఉందా..? గతంలో ఇద్దరి మహిళలకు మంత్రులుగా అవకాశం కల్పిస్తానన్న కేసీఆర్ ఈ విస్తరణలోనైనా తన మాట నిలబెట్టుకుంటారా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
undefined
ఆగస్టు మొదటి వారంలో తెలంగాణ మంత్రి వర్గాన్ని విస్తరించేందుకు గులాబీ బాస్ కసరత్తు చేస్తున్నారని ఎవరెవరికి అవకాశాలు ఇవ్వాలో కూడా ఇప్పటికే డిసైడ్ అయినట్లు సమాచారం. మంత్రి వర్గంలో నలుగురికి స్థానం కల్పించనున్నట్లు తెలుస్తోంది.
undefined
ఆగస్టు 6న మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉండొచ్చని పార్టీ కార్యాలయం వద్ద గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈసారి కేబినెట్ విస్తరణలో సీనియర్ నేతలకే బెర్త్ లు కన్ఫమ్ చేసినట్లు తెలుస్తోంది.
undefined
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులను కూడా కేసీఆర్ మంత్రి వర్గంలో తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వీరి బెర్త్ లు దాదాపు కన్ఫమ్ అయిపోయినట్లు విశ్వసనీయ సమాచారం.
undefined
ఇకపోతే కేసీఆర్ మంత్రి వర్గంలో పార్టీ సీనియర్ నేత హరీష్ రావుకు స్థానం కల్పించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీలో కొందరు నేతలు సైతం హరీష్ రావును మంత్రి వర్గంలో తీసుకోకపోవడంపై పెదవి విరుస్తున్నారు.
undefined
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను సీఎంను చేసేందుకే హరీశ్ ను మంత్రి వర్గంలో తీసుకోవడం లేదని అటు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ వాదనలపై టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు వివరణ ఇస్తూనే ఉంది.
undefined
అయితే హరీశ్ రావు అంశానికి ఫుల్ స్టాప్ పెట్టే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి హరీశ్ రావును మంత్రి వర్గంలో తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. మెుత్తానికి ఈసారి కేబినెట్ విస్తరణలో నలుగురు సీనియర్ నేతలకు స్థానం కల్పించనున్నట్లు సమాచారం.
undefined
ఇకపోతే ప్రస్తుతం తెలంగాణ మంత్రివర్గంలో సీఎం కేసీఆర్ తోపాటు 12 మంది మంత్రులు ఉన్నారు. వాస్తవానికి పూర్తి కేబినెట్ లో సీఎంతో కలిపి మెుత్తం 18 మందికి మంత్రి వర్గంలో ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. అంటే ఆరుగురికి కేసీఆర్ కేబినెట్ లో స్థానం దక్కనుంది.
undefined
అయితే ప్రస్తుతానికి సీఎం కేసీఆర్ నలుగురికే అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. మిగిలిన రెండు మంత్రి పదవులను మున్సిపల్ ఎన్నికల అనంతరం భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం.
undefined
ఇకపోతే ఉమ్మడి కరీనంగర్‌ జిల్లా నుంచి ఇప్పటికే ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్‌ మంత్రివర్గంలో ఉన్నారు. ఆగష్టు 6న జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో ఇదే జిల్లా నుంచి సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మాజీమంత్రి కేటీఆర్ కు మరోసారి ఛాన్స్ ఇవ్వనున్నారు కేసీఆర్.
undefined
కేటీఆర్ కు మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మంత్రి వర్గంలో ముగ్గురుకు స్థానం కల్పించినట్లు అవుతుంది. కేటీఆర్ ను మంత్రి వర్గంలోకి తీసుకుంటే మరి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వేరొకరికి కట్టబెడతారా లేక రెండూ కేటీఆర్ చూస్తారా అన్నది తెలియాల్సి ఉంది.
undefined
ఇకపోతే ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి హరీశ్ రావు కు అవకాశం కల్పిస్తున్నారు సీఎం కేసీఆర్. ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్ధిపేట నియోజకవర్గం నుంచి హరీశ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణలో అత్యధికసార్లు అసెంబ్లీకి ఎన్నికైన వ్యక్తిగా రికార్డు సృష్టించడంతో పాటు అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఎమ్మెల్యే కూడా కావడం విశేషం.
undefined
మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితులలో ఒకరు మాజీమంత్రి ఖమ్మం జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు. తుమ్మల నాగేశ్వరరావు ముందస్తు ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు.
undefined
అంతేకాదు ఖమ్మం జిల్లాలో ఖమ్మం నియోజకవర్గం మినహా మిగిలిన అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలని గులాబీ బాస్ ఆలోచిస్తున్నారు.
undefined
ముందస్తు ఎన్నికల అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ గెలిస్తే తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు తుమ్మలకు మరోసారి మంత్రి వర్గంలో అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
undefined
అంతేకాదు పార్టీ అంతర్గత కారణాల వల్లే తుమ్మల నాగేశ్వరరావు ఓటమి పాలయ్యారని తెలుసుకున్న కేసీఆర్ ఆయనపై ఆది నుంచి సానుభూతితో ఉన్నారు. ఆయనకు సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఆయనకు మంత్రిగా అవకాశం కల్పించనున్నారు. ఇకపోతే మంత్రి వర్గంలో ఈసారి తనకు అవకాశం దక్కుతుందని భావించిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ఆశలకు ఆడియాశలుగానే మిగిలిపోనున్నాయని తెలుస్తోంది.
undefined
ఇకపోతే ఈసారి జరగబోయే కేబినెట్ విస్తరణలో మహిళకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ హోంశాఖ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి అవకాశం కల్పిస్తారని టాక్. సబితా ఇంద్రారెడ్డికి మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తే తెలంగాణ తొలి మహిళా మంత్రిగా రికార్డు సృష్టించనున్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయదుందుభి మోగించింది.
undefined
మెుదటి ఐదేళ్లు మంత్రి వర్గంలో మహిళలకు స్థానం కల్పించలేదు కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డిని డిప్యూటీ స్పీకర్ గా నియమించగా మరికొందరిని ప్రభుత్వ విప్ లుగా నియమించారు. ఆ తర్వాత ముందస్తు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత కూడా మంత్రి వర్గంలో మహిళలకు స్థానం కల్పించలేదు కేసీఆర్. మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడం లేదంటూ విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలకు దిగుతున్నాయి.
undefined
ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సైతం అసెంబ్లీలో నిలదీసింది. మంత్రి వర్గ కేబినెట్ లో మహిళలకు ఎందుకు స్థానం కల్పించలేకపోయారంటూ నిలదీసింది. ప్రతిపక్ష ప్రశ్నకు సమాధానంగా జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో ఇద్దరు మహిళలకు అవకాశం ఇస్తానని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
undefined
ఇకపోతే ఆగష్టు 6న జరగబోయే మంత్రి వర్గ విస్తరణలో నలుగురికి అవకాశం కల్పించగా మున్సిపల్ ఎన్నికల అనంతరం మరో ఇద్దరిని కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
undefined
కేసీఆర్ కేబినెట్ లో మంత్రిపదవి కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నల్గొండ జిల్లాకు చెందిన గుత్తా సుఖేందర్ రెడ్డికి అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర రైతు సాధికార కమిషన్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.
undefined
ఇకపోతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి మాజీ మంత్రి లక్ష్మారెడ్డికి మరోసారి అవకాశం కల్పించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. భవిష్యత్ లో జరిగే మంత్రి వర్గ విస్తరణలో అవకాశం కల్పిస్తానని లక్ష్మారెడ్డికి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇకపోతే ఇప్పటికే ఉమ్మడి మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి వి.శ్రీనివాస్ గౌడ్, ఎస్ నిరంజన్ రెడ్డిలు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లక్ష్మారెడ్డి రాకతో ఆ సంఖ్య మూడుకు చేరుకోనుంది.
undefined
click me!