ఈ రైలు నాగర్కోయిల్ నుంచి బయలుదేరి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా హైదరాబాద్లోని చర్లపల్లి వరకు నడుస్తుంది. ఇది హై-స్పీడ్, పుష్-పుల్ టెక్నాలజీతో కూడిన రైలు. ఇందులో నాన్-ఏసీ స్లీపర్, జనరల్ కోచ్లు అందుబాటులో ఉంటాయి. మధ్యతరగతి ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని తక్కువ ధరలో అందించడమే ఈ రైలు లక్ష్యం.