టూరిస్టులను ఆకర్షిస్తున్న హైదరాబాద్ సమాధులు ... మీరు చూసారా?

First Published Sep 14, 2024, 7:56 PM IST

కాదేదీ కవితకు అనర్హం అన్నాడు ఆనాటి ఓ కవి ... కాదేది చూసేందుకు అనర్హం అంటున్నారు నేటి పర్యాటకులు. ప్రకృతి అందాలు, ప్రాచీన ప్రదేశాలే కాదు సమాధులు కూడా టూరిజం స్రాంతాలుగా మారాయి. ఇలా హైదరాబాద్ లో కొన్ని సమాధులను చూసేందుకు ప్రజల ఇష్టపడుతున్నారు.   

Hyderabad

Hyderabad Tourism : అందమైన ప్రకృతి అందాలు లేదంటే అద్భుత శిల్పకళతో కూడిన ప్రాచీక కట్టడాలు పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. ఆహ్లాదాన్ని, విజ్ఞానాన్ని అందించే వాటిని ప్రభుత్వాలు పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతుంటాయి. ఇలా పచ్చటి అడవులు, జాలువారే జలపాతాలు, జలాశయాలు, సరస్సులు, నదులు, హిల్ స్టేషన్స్, రాజ భవనాలు, ప్రాచీన ప్రార్థనా స్థలాలు వంటివి పర్యాటక ప్రాంతాలుగా మారతాయి. చివరకు ప్రకృతి విపత్తులు,  ప్రమాదాలు, ఉద్రిక్త పరిస్థితులను చూసేందుకు ప్రజలు తరళివెళ్లడం డార్క్ టూరిజంగా ప్రసిద్ది చెందింది. అలాంటిది సమాధుల సందర్శన  కూడా టూరిజంలో భాగమయ్యింది. 
 

hyderabad

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కూడా పలు ప్రాచీన సమాధులు టూరిజం స్పాట్స్ గా మారాయి. అవి మామూలు సమాధులు కావు... అద్భుత శిల్పకలతో నగర చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచినవి. అంతేకాదు హైటెక్ నగర అందాలను మరింత పెంచేలా ఈ సమాధులు వున్నాయి. ఇలా పర్యాటకులను ఆకర్షిస్తున్న హైదరాబాద్ సమాధులేమిటో చూద్దాం. 
 

Latest Videos


qutubshahi tombs

కుతుబ్ షాహీ సమాధులు : 

హైదరబాద్ నగరాన్ని నిర్మించిన కుతుబ్ షాహీ వంశీయులు సమాధులు ఇప్పుడు సందర్శనీయ ప్రదేశాలుగా మారాయి. ఇండో ఇస్లామిక్ శైలిలో నిర్మించిన ఈ సమాధులు ఎంతగానో ఆకట్టుకుంటాయి. 16వ శతాబ్దానికి చెందిన చారిత్రక సమాధులు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపబడ్డాయి. 

హైదరాబాద్ ను పాలించిన కుతుబ్ షాహీ సుల్తానుల సమాధులన్ని ఇలా ఒకేచోట వున్నాయి. కుతుబ్ షాహీలు సమాధులను ఎంతో పవిత్రమైనవిగా భావించేవారట...అందువల్లే అత్యంత సుందరంగా వారి పూర్వికుల సమాధులను తీర్చిదిద్దారు. ఇలా ప్రతిఒక్కరు తమకంటే ముందు పాలించిన సుల్తానుల సమాధులను నిర్మించి పరిరక్షించారు. అందువల్లే ఇప్పటికీ ఈ సమాధులు చెక్కుచెదరకుండా నిలిచాయి. 

ఈ సమాధులు గోల్కొండ కోటకు ఉత్తరాన కిలోమీటర్ దూరంలో ఇబ్రహీ బాగ్ లో వున్నాయి.  ఒకప్పుడు ఈ సమాధులపై ఖరీదైన కార్పెట్లు,వెల్వెట్ తెరలు, షాండ్లియర్లు, వెండి అలంకరణ సామాగ్రి వుండేవి. అలాగే అందమైన పూదోటలు వుండేవి. కాలక్రమేనా ఇవన్నీ కనుమరుగయ్యాయి. కానీ చారిత్రక నేపథ్యం కలిగిన ఈ సమాధులను హైదరాబాదీలు,తెలుగు ప్రజలే కాదు దేశ విదేశాలకు చెందిన పర్యాటకులు కూడా సందర్శిస్తుంటారు.
 

Paigah Tombs

పైగా సమాధులు : 

పైగా సమాధులు కూడా హైదరాబాద్ లో సందర్శనీయ ప్రాంతాలు. వీరు రాజులు కాదు... నిజాం రాజుల వద్ద కీలక బాధ్యతలు నిర్వర్తించివారు. ఇలా నిజాం పాలనలో కీలకంగా వ్యవహరించిన ఈ పైగా వంశీయుల సమాధులు పాతబస్తీ ప్రాంతంలో వున్నాయి. పిసల్ బండ ప్రాంతంలో ఓవైసిహాస్పిటల్ కు సమీపంలో ఈ సమాధులు వున్నాయి. 

అద్భుతమైన పురాతన కళలను ఈ సమాధుల గోడలపై చూడవచ్చు.   అందమైన పాలరాతి శిల్పాలు,  కళాసంపదకు ఈ సమాధుల వద్ద కనిపిస్తుంది. 200 సంవత్సరాల నాటి ఈ సమాధులను నిర్లక్ష్యంగా వదిలేయడంతో బాగా  దెబ్బతిన్నాయి. అయినప్పటి ఇప్పటికీ ఆ చెదిరిన సమాధుల అందాలే పర్యాటకులకు ఆకట్టుకుంటాయి. 
 

NTR Ghat

ఎన్టిఆర్ ఘాట్ : 

తెలుగు సినీ, రాజకీయ చరిత్రలో నిలిచిపోయే పేరు నందమూరి తారక రామారావు (ఎన్టిఆర్). సినీ నటుడిగా తెలుగు ప్రేక్షకులను ఎంతగా అలరించారో... ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా అంతకంటే చక్కటి పాలన అందించారు ఎన్టిఆర్. ఇలా తెలుగు ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే ఆయన సమాధి హుస్సెన్ సాగర్ తీరంలో వుంది. 

ఎన్టిఆర్ సమాధి ఇప్పుడు హైదరాబాద్ లోని సందర్శనీయ ప్రదేశాల్లో ఒకటి. ఎన్టిఆర్ ఘాట్ గా పిలవబడే ఈ సమాధి నిర్మాణం, చుట్టూ అలంకరించిన తీరు ఆకట్టుకుంటుంది. ఎన్టిఆర్ జయంతి, వర్దంతి సమయంలో నందమూరి కుటుంబసభ్యులు, టిడిపి నాయకులు, పర్యాటకులతో ఈ ఘాట్ సందడిగా వుంటుంది. 

click me!