హుజూరాబాద్ ఉపఎన్నిక ఆలస్యం: కాంగ్రెస్‌కి కలిసొచ్చిందా?

Published : Sep 09, 2021, 12:46 PM IST

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని వెతుక్కొనే పనిలో ఉంది. అభ్యర్ధి ఎంపిక ఇంకా సమయం తీసుకొనే అవకాశం ఉంది.

PREV
112
హుజూరాబాద్ ఉపఎన్నిక ఆలస్యం: కాంగ్రెస్‌కి కలిసొచ్చిందా?
TMC wants EC Bengal in-charge removed   Trinamool Congress wants the Election Commission to remove Deputy Election Commissioner Sudip Jain as West Bengal in-charge.    In a media briefing TMC leader Saugata Roy, TMC claimed that there were 'serious doubts' about Jain's impartiality'.   The TMC has also shot a letter to the EC in this regard and alleged that Jain had been working to benefit a political party.

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖంగా లేదు. దీంతో అక్టోబర్ చివర్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.అయితే ఈ పరిణామం తెలంగాణ కాంగ్రెస్ కు కలిసి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

212

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి  టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ లు బరిలోకి దిగనున్నారు. ఇక కాంగ్రెస్ నుండి అభ్యర్ధి ఎవరనే విషయమై ఇంకా స్పష్టం కాలేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలో  అన్వేషిస్తోంది

312
రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో వలసల్లో మరింత వేగం పెంచాలని ఆ పార్టీ భావిస్తోంది.కాంగ్రెస్ ను బలహీనపరిస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తాము ప్రధాన ప్రత్యర్ధిగా మారే అవకాశం ఉంటుందని బీజేపీ ప్లాన్ చేస్తోంది.

ఇప్పటికిప్పుడే ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదని తేటతెల్లమైంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. అభ్యర్ధి ఎంపికకు కాంగ్రెస్ కు సమయం కలిసి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. 

412
ఈ ఎన్నికల్లో పొత్తుల విషయాలపై చర్చించేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నేతృత్వంలో టీపీసీసీ  కమిటీ ఏర్పాటు చేసింది. జీవన్ రెడ్డి కమిటీ పలువురు నేతలతో చర్చించింది. ఈ చర్చల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధిని బరిలోకి దింపాలని పలువురు నేతలు స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ ముఖ్యుల సమావేశం ఇటీవల హైద్రాబాద్ లో జరిగింది. ఈ సమావేశంలో కరీంనగర్ జిల్లాకు చెందిన కీలక నేతలు పొన్నం ప్రభాకర్, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబుల అభిప్రాయాలు సేకరించిన తర్వాత  అభ్యర్ధి ఎంపికపై ఎఐసీసీకి నివేదికను పంపాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు నిర్ణయం తీసుకొన్నారు. 

512
Congress flag


మరోవైపు ఈ నెల 10వ తేదీ లోపుగా ఈ స్థానం నుండి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న అభ్యర్దుల నుండి ధరఖాస్తులను ఆహ్వానించారు.

612
congress flag

అయితే ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్ధులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఉప ఎన్నికలు ఆలస్యంగా జరగడం కాంగ్రెస్  పార్టీకి కలిసి వచ్చిందని ఆ పార్టీ నేతలు సంతోషంగా ఉన్నారు.

712
జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ప్రధాన పార్టీలన్నీ అభ్యర్ధుల వేటలో మునిగిపోయాయి. జీహెచ్ఎంసీపై మరోసారి జెండాను ఎగురవేయాలని టీఆర్ఎస్ భావిస్తుండగా, బల్దియాపై  కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.  ఈ ఎన్నికల్లో తమ పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది. అయితే  ఈ ఎన్నికల్లో పోటీ చేస్తామని టీడీపీ ప్రకటించింది.ఈ ఎన్నికల్లో గెలిచే అభ్యర్ధులను బరిలోకి దింపాలని ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.


అయితే ఇప్పటికే  ప్రచారంలో ఉన్న టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్ధులు పోలింగ్ జరిగే వరకు  ఓటర్లను తమ వైపునే ఉండేలా చేయడం అంత ఆషామాషీ వ్యవహరం కాదు. 

812
etela

రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ ను ఓడించాలని ఆ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అధికార పార్టీకి ఉప ఎన్నిక వాయిదా పడినా, ఇప్పటికిప్పుడే నిర్వహించినా పెద్దగా నష్టం ఉండదని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. 

912
etela


అయితే టీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు మాత్రం ఉప ఎన్నికలు ఆలస్యంగా జరగడం కొంత ఇబ్బందేనని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

1012
etela rajender

ఈ నియోజకవర్గంలో కోట్ల రూపాయాలను ఖర్చు పెడుతున్నాయని టీఆర్ఎస్, బీజేపీ పరస్పరం విమర్శలు చేసుకొన్నాయి. ఈటల రాజేందర్ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు గడియారాలు,కుంకుమ భరిణలతో పాటు ఇతర వస్తువులను పంపిణీ చేశారని మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు.ఈ విమర్శలను మాజీ మంత్రి ఈటల రాజేందర్ తిప్పికొట్టారు. హరీషఁ్ రావు ఆరోపణలను కొట్టిపారేశారు.

1112
kcr

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ, టీఆర్ఎస్ లు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకొంది. అయితే కాంగ్రెస్ మాత్రం ఈ ప్రచారంలో ఎక్కడా కన్పించడం లేదు. 

1212
Kaushi Reddy


ఈ నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా  పోటీ చేసిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. గత ఎన్నికల్లో ఆయనకు 60 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. కానీ ఈ దఫా మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని వెతుక్కుంటుంది. ఈ పరిణామం రాజకీయంగా కాంగ్రెస్ కు కలిసి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. 

click me!

Recommended Stories