హైదరాబాద్ లో బ్లాక్ ఫంగల్ ఇన్ ఫెక్షన్ టెర్రర్.. కరోనా నుంచి కోలుకున్నవారిలో..

First Published May 11, 2021, 10:28 AM IST

కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న చాలామందికి ఆ సంతోషం ఎక్కువ రోజులు ఉండట్లేదు. బ్లాక్ ఫంగస్ ఇన్ ఫెక్షన్ రూపంలో మళ్లీ అనారోగ్య సమస్యలు తలెత్తుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 

కరోనా మహమ్మారి నుంచి కోలుకున్న చాలామందికి ఆ సంతోషం ఎక్కువ రోజులు ఉండట్లేదు. బ్లాక్ ఫంగస్ ఇన్ ఫెక్షన్ రూపంలో మళ్లీ అనారోగ్య సమస్యలు తలెత్తుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
undefined
ఇప్పటివరకు ఢిల్లీ, అహ్మదాబాద్, మహారాష్ట్రలో మాత్రమే బయటపడిన ఈ ఫంగస్ ఇన్ ఫెక్షన్ తాజాగా హైదరాబాద్ లోనూ వెలుగు చూసింది.
undefined
హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఐదుగురు కరోనా బాధితుల్లో ఈ ఇన్ ఫెక్షన్ ఉన్నట్లు గుర్తించారు. బ్లాక్ ఫంగస్ ఇన్ ఫెక్షన్ సోకిన వారిలోనూ కరోనా లక్షణాలే కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
undefined
కరోనా చికిత్సలో భాగంగా అడ్డగోలుగా స్టెరాయిడ్స్ వాడుతున్న వారిలో రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారిలో ఈ బ్లాక్ ఫంగస్ ఇన్ ఫెక్షన్ ఎక్కువగా కనిపిస్తోందని ఆస్పత్రి ఈఎన్ టీ వైద్యులు చెబుతున్నారు.
undefined
ఈ ఫంగస్ ముక్కునుంచి రక్తనాళాలకు వెళ్లి కండరాలు, ఎముకలను దెబ్బతీస్తుంది. ఇది ప్రాణాలకే ప్రమాదం. వాతావరనంలో సహజంగా ఉండే మ్యుకోర్ అనే ఫంగస్ వల్ల ఇది వ్యాపిస్తుంది.
undefined
అవయవ మార్పిడి చికిత్సలు చేయించుకున్న వారికి, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, కోవిడ్ చికిత్సలో హై డోస్ స్టెరాయిడ్స్ వాడటం, ఇంటి పరిసరాలు, ఆస్పత్రి పరిసరాల్లో పరిశుభ్రత లోపించడం వల్ల ఇది వ్యాపిస్తుంది.
undefined
మధుమేహంతో బాధపడుతున్న వారికి గ్లూకోజ్ స్థాయిని మానిటరింగ్ చేస్తూ స్టెరాయిడ్స్ ఇవ్వాలి. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ముక్కు, నోటిలో పొక్కులు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.. అని డాక్టర్లు చెబుతున్నారు.
undefined
click me!