తెలంగాణలో రెండ్రోజులు వర్షాలు :
తెలంగాణలో ఇప్పటికే పలు జిల్లాల్లో చిరుజల్లులు మొదలయ్యాయి. నిన్న(గురువారం) నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసాయి. ఈ వర్షాలు ఈ మూడ్రోజులు (శుక్ర, శని, ఆదివారం) కొనసాగనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ద్రోణి ప్రభావంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణపై వర్ష ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మిగతా ప్రాంతాల్లో కూడా వర్షాలు లేకున్నా వాతావరణ చల్లగా మారిపోతుందని తెలిపారు. మొత్తంగా ఈ వర్షాల కారణంగా ఇప్పుడు నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలు కొంత తగ్గుతాయని తెలిపారు.
మండుటెండలు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇళ్ళనుండి బయటకు వెళ్లేందుకు జంకుతున్న పిల్లలు, పేరేంట్స్ కు ఈ కూల్ వెదర్ కాస్త ఊరటనివ్వనుంది. ఈ ఆదివారం కూడా వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయి... కాబట్టి చల్లచల్లని వాతావరణంలో బయటకు వెళ్లి సరదాగా గడపవచ్చు. ఇలా వర్షాలతో వీకెండ్ హాయిగా గడిచిపోతుంది.