హుజూరాబాద్ బైపోల్: అభ్యర్ధి కోసం కాంగ్రెస్ అన్వేషణ, రేసులో వీరే

First Published Jul 29, 2021, 2:44 PM IST

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి  పోటీ చేసే అభ్యర్ధులపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ ఛైర్మెన్ దామోదర రాజనర్సింహ రెండు రోజుల క్రితం హుజూరాబాద్ లో పర్యటించారు.

రాష్ట్రంలోని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో వలసల్లో మరింత వేగం పెంచాలని ఆ పార్టీ భావిస్తోంది.కాంగ్రెస్ ను బలహీనపరిస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తాము ప్రధాన ప్రత్యర్ధిగా మారే అవకాశం ఉంటుందని బీజేపీ ప్లాన్ చేస్తోంది.

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో  పోటీ చేసే అభ్యర్ధి ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ కసరత్తును ప్రారంభించింది. 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన కౌశిక్ రెడ్డి ఆ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కొత్త అభ్యర్ధి కోసం అన్వేషణ ప్రారంభించింది.


ఈ స్థానం నుండి పోటీ చేయడానికి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆసక్తి చూపడం లేదు. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం తర్వాత ఆ పార్టీ తొలిసారి ఈ ఉప ఎన్నికను ఎదుర్కొంటుంది.
 

కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థికి తాము సహకరించినట్టుగా టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎంపీ స్థానంలో ని చాలా చోట్ల బీజేపీ అభ్యర్ధికి టీఆర్ఎస్ క్యాడర్ మద్దతుగా ప్రచారం నిర్వహించిందని ఆయన ఆరోపించారు.

ఎన్ఎస్‌యూఐ నేత విద్యార్ధి రాజకీయాల నుండి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. కరీంనగర్ ఎంపీ స్థానం నుండి ఆయన రెండు దఫాలు ప్రాతినిథ్యం వహించారు. హుజూరాబాద్ నుండి ఆయన పోటీ చేస్తే కాంగ్రెస్ కు కలిసివచ్చే అవకాశం ఉందని  కొందరు నేతలు భావిస్తున్నారు. అయితే తాను పోటీకి దూరంగా ఉంటానని ఆయన తేల్చి చెప్పారు.

huzurabad

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2.3 లక్షల ఓటర్లున్నారు. అయితే వీరిలో 35 నుండి 40వేల మంది దళిత ఓటర్లున్నారు. అయితే దళిత సామాజికవర్గం నుండి బలమైన నేత ఏ పార్టీలోనూ లేరు. దీంో రెడ్డి సామాజిక వర్గం నుండి  ఈ నియోజకవర్గంలో రాజకీయాలను ప్రభావితం చేస్తున్న నేతలు ఎదిగారు. 

Kaushi Reddy

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా కౌశిక్ రెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.  ఆ ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి 60 వేలకు పైగా ఓట్లు దక్కాయి. 

Siricilla _KTR


గతంలో సిరిసిల్ల అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన కెకె మహేందర్ రెడ్డి, వట్టి కృష్ణారెడ్డిల పేర్లు కాంగ్రెస్ లో ప్రముఖంగా విన్పిస్తున్నాయి. సిరిసిల్లలో టీఆర్ఎస్ బలోపేతంలో కెకె మహేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. సిరిసిల్లలో టీఆర్ఎస్  కేటీఆర్ ను బరిలోకి దింపడాన్ని వ్యతిరేకిస్తూ మహేందర్ రెడ్డి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

সেই প্রস্তাব সরাসরি ফিরিয়ে দিয়েছেন বলে জানিয়েছেন ওই প্রবীন বিধায়ক। তিনি জানিয়েছেন, বয়সের কারণেই তিনি দলের কাজ থেকে অবসর নিয়েছেন। কিন্তু মতাদর্শ থেকে বিচ্যুত হননি। টাকা-পয়সা দিয়ে তৃণমূল নেতা-নেত্রীদেরই কেনা যায়।

సీపీఎం నుండి పార్టీ ఫిరాయించిన కృష్ణ అనే వ్యక్తి పేరు కూడ కాంగ్రెస్ వర్గాల్లో విన్పిస్తోంది.కృష్ణకు కొన్ని ప్రాంతాల్లో స్థానికంగా పట్టుంది.

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీకి పొన్నం సహా కొందరు సీనియర్లు పోటీకి అంతగా ఇష్టపడడం లేదు.  ఈ ఎన్నికల్లో కేసీఆర్ కు ఎదురు దెబ్బ తగలాలంటే ఈటల రాజేందర్ విజయం సాధించాలి

Congress flag

దీన్ని దృష్టిలో ఉంచుకొని హుజూరాబాద్ లో కాంగ్రెస్ బలమైన అభ్యర్ధిని బరిలోకి దింపకపోవచ్చనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు 

ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా పనిచేసిన నేతకు జహీరాబాద్ ఎంపీ సీటును ఇస్తామని బీజేపీ ఆఫర్ ఇచ్చిందని చెబుతున్నారు. అయితే గతంలో తాను ప్రాతినిథ్యం వహించిన అసెంబ్లీ సీటు ఇవ్వాలని ఆయన బీజేపీని కోరినట్టుగా ప్రచారం సాగుతోంది. గతంలో కూడ ఆయన బీజేపీలో చేరుతారని ప్రచారం సాగింది. కానీ ఆయన కాంగ్రెస్ లోనే కొనసాగారు.ప్రస్తుత ప్రచారం కూడ అలాంటిదినేనా.. కాదా అనేది కాలమే నిర్ణయించాలి.


కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ ఛైర్మెన్ దామోదర రాజనర్సింహ నియోజకర్గంలో పర్యటించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల గురించి వాకబు చేశారు. ఎన్నికల కమిటీ త్వరలోనే సమావేశమై పోటీ చేసే అభ్యర్ధులను ఖరారు చేసే అవకాశం ఉంది.

click me!