గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ రెఢీ: రాములునాయక్, చిన్నారెడ్డి పేర్లు ఖరారు?

First Published Jan 14, 2021, 1:33 PM IST

త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుండే సన్నాహలు చేస్తోంది.ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులను ఆ పార్టీ ఖరారు చేసినట్టుగా సమాచారం. అధకారికంగా అభ్యర్ధుల పేర్లను ప్రకటించడమే తరువాయిగా భావిస్తున్నారు. 

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల పేర్లను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దాదాపుగా ఖరారు చేసినట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
undefined
ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీ నేతల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. సామాజిక సమీకరణాలతో పాటు రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అభ్యర్ధులను ఖరారు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది.
undefined
ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్తానాలకు ఎన్నికలు జరగనున్నాయి. హైద్రాబాద్ రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల ఎమ్మెల్సీ స్థానంతో పాటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.
undefined
నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పేరును కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దాదాపుగా ఖరారు చేసిందనే ప్రచారం సాగుతోంది.
undefined
ఈ స్థానం నుండి ఓయూ విద్యార్ధి నేత మానవతారాయ్ పేరును కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పరిశీలించింది. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో రాములునాయక్ పేరును కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దాదాపుగా ఖరారు చేసిందని తెలుస్తోంది.
undefined
హైద్రాబాద్ రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి చిన్నారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి పేర్లను కాంగ్రెస్ పార్టీ పరిశీలించింది. వంశీచంద్ రెడ్డి కంటే చిన్నారెడ్డికే అవకాశం కల్పించాలని పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకొందని సమాచారం.
undefined
జిల్లా రాజకీయ పరిస్థితులు, ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకొని చిన్నారెడ్డి వైపే కాంగ్రెస్ నాయకత్వం మొగ్గు చూపిందనే ప్రచారం సాగుతోంది.
undefined
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీకి ఆసక్తిగా ఉన్న వారి నుండి ధరఖాస్తులను స్వీకరించారు. నల్గొండ స్థానానికి 26, హైద్రాబాద్ స్థానానికి 24 ధరఖాస్తులు వచ్చాయి.ఈ ధరఖాస్తుల పరిశీలన సాగుతున్న సమయంలోనే టీజేఎస్ చీఫ్ కోదండరామ్ , ఇంటిపార్టీ చీఫ్ చెరుకు సుధాకర్ లు కూడ ఈ ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని కాంగ్రెస్ పార్టీని కోరారు.
undefined
ఈ ఎన్నికల్లో పొత్తుల విషయాలపై చర్చించేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నేతృత్వంలో టీపీసీసీ కమిటీ ఏర్పాటు చేసింది. జీవన్ రెడ్డి కమిటీ పలువురు నేతలతో చర్చించింది. ఈ చర్చల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధిని బరిలోకి దింపాలని పలువురు నేతలు స్పష్టం చేశారు.
undefined
ఈ కమిటీ సూచన మేరకు టీపీసీసీ ఒక్కో స్థానంలో మూడు పేర్లతో షార్ట్ లిస్ట్ చేసి అధిష్టానానికి పంపింది. ఈ ముగ్గురిలో ఎవరో ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్ధిగా నిర్ణయించనుంది.
undefined
త్వరలో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపికను చేస్తోంది.
undefined
2018 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ను వీడి రాములునాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రెండేళ్ల ఎమ్మెల్సీ పదవిని కూడ ఆయన కోల్పోయాడు. గిరిజన వర్గాల్లో రాములునాయక్ కు పట్టుంది. గత ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. దీంతో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాములునాయక్ కు అవకాశం కల్పించాలని భావిస్తున్నారు.
undefined
నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో గిరిజన ఓటర్లసంఖ్య కూడ ఎక్కువగానే ఉంటుంది. రాములునాయక్ కు సీటివ్వడం ద్వారా గిరిజనులను సంతృప్తి పర్చేందుకు గాను కాంగ్రెస్ పార్టీ ప్లాన్ గా కన్పిస్తోంది.
undefined
పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ కు ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఇంచార్జీగా ఉన్నందున ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించనున్నారు. ఇదే స్థానం నుండి సీటు ఆశించిన మానవతారాయ్ సేవలను పార్టీకి వినియోగించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
undefined
హైద్రాబాద్ స్థానం నుండి మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలంగౌడ్, రామ్మోహన్ రెడ్డిలు పోటీ నుండి తప్పుకొన్నారు. చిన్నారెడ్డి, వంశీచంద్ రెడ్డిల మధ్య పోటీ నెలకొంది. అనుభవం ఉన్న నేత చిన్నారెడ్డి వైపే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొగ్గు చూపిందని సమాచారం.
undefined
click me!