గులాబీ బాస్ దూకుడు: ఫిబ్రవరిలో కేసీఆర్ జిల్లాల టూర్

First Published Jan 13, 2021, 11:33 AM IST

తెలంగాణ రాష్ట్రంలో  పార్టీని మరింత బలోపేతం చేసేందుకు గాను సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.పార్టీతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను సమన్వయం చేసుకొంటూ ముందుకు వెళ్లాలని కేసీఆర్ తలపెట్టారు. 

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ వ్యూహాన్ని మార్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 17వ తేదీ తర్వాత సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు.
undefined
తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పరాజయం పాలైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఆశించిన ఫలితాలు రాలేదు. త్వరలోనే పట్టభద్రుల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.
undefined
రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో వేగం పెంచుతూనే పార్టీని బలోపేతం చేయాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.
undefined
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ద్విముఖ వ్యూహంతో వెళ్లాలని సీఎం కేసీఆర్ తలపెట్టారు.
undefined
ఈ నెలాఖరులోపుగా ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ, పదోన్నతులు, ధరణి పోర్టల్ లో మార్పులు, చేర్పులు వంటి కిలీక సమస్యలకు పూర్తి స్థాయిలో పరిష్కారం చూపాలని కేసీఆర్ యోచిస్తున్నారు.
undefined
వచ్చే నెల 17వ తేదీ తర్వాత సీఎం కేసీఆర్ జిల్లాల్లో పర్యటించాలని భావిస్తున్నారు. ఈ మేరకు కేసీఆర్ టూర్ ప్లాన్ చేసుకొంటున్నారు.
undefined
వేతన సవరణ నివేదిక ప్రభుత్వానికి నివేదిక అందింది. సంక్రాంతి తర్వాత పీఆర్సీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంది.
undefined
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ మేరకు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి మూడో వారంలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం లేకపోలేదు.
undefined
ఎల్ఆర్ఎస్ సహా ప్రభుత్వానికి ఇబ్బందికి మారిన కొన్ని కీలకమైన అంశాలపై కేసీఆర్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఎల్ఆర్ఎస్ లేని భూముల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.
undefined
యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను ఫిబ్రవరి నెలాఖరులోపుగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఆలయ పున: ప్రారంభోత్సవాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు.
undefined
దీన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున యాగం నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు. యాగం నిర్వహణకు సంబంధించి కేసీఆర్ వేద పండితులతో చర్చిస్తున్నారు. ఈ యాగం పూర్తైన తర్వాత ఫిబ్రవరి చివరి వారంలో జిల్లాల టూర్ కు కేసీఆర్ ప్లాన్ చేసుకొంటున్నారు.
undefined
జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇప్పటికే సిద్దిపేట జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రారంభించారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల కార్యాలయాలను కూడ జిల్లాల టూరులో కేసీఆర్ ప్రారంభించే అవకాశం ఉంది.
undefined
జిల్లాల వారీగా ఎంపిక చేసిన కార్యకర్తలకు సీఎం కేసీఆర్ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ఏడాది జూన్ లోపుగా కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం పూర్తి చేయనుంది
undefined
జిల్లాల పర్యటనకు ముందే నామినేటేడ్ పోస్టులను భర్తీ చేయాలని కూడా టీఆర్ఎస్ చీఫ్ భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా నామినేటేడ్ పదవులు ఆశిస్తున్న నేతల జాబితా సీఎంకు అందింది. మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకొన్న తర్వాత నామినేటేడ్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది.
undefined
click me!